ETV Bharat / state

ఏపీకి ప్రధాని మోదీ - నాసిన్​ను ప్రారంభించనున్న పీఎం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2024, 4:01 AM IST

Updated : Jan 16, 2024, 7:24 AM IST

PM Modi To Inaugurate NACIN Centre: నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ను ప్రారంభిస్తారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

PM Modi To Inaugurate NACIN Centre
PM Modi To Inaugurate NACIN Centre

PM Modi To Inaugurate NACIN Centre: నేడు ప్రధాని మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాసిన్‌ (National Academy of Customs, Indirect Taxes and Narcotics)ను ప్రారంభించనున్నారు. నాసిన్ ప్రారంభోత్సవాని కంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్న మోదీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ వద్ద ప్రారంభానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రధాని మోదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్​లో చేరుకోనున్నారు. ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను మధ్యాహ్నం 2 గంటలకు మోదీ సందర్శించనున్నారు. ఇందుకోసం లేపాక్షి ఆలయానికి సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శన అనంతరం హెలికాప్టర్​లో నాసిన్ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు.

పీఎం జన్​మన్ కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో మోదీ వర్చువల్ సమావేశం

ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్ లో శిక్షణ: సీఎం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి హెలీకాప్టర్​లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిన్​కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్​లు హాజరుకానున్నారు. నాసిన్​లో సభావేదిక ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్​లో ప్రత్యేక శిక్షణ ఇవ్వటానికే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మధ్యాహ్నం మూడు- సాయంత్రం ఐదు గంటల మధ్య నాసిన్ ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఆలయ పరిసరాలను శుద్ధి చేసిన ప్రధాని మోదీ- శ్రమదానం చేయాలని ప్రజలకు పిలుపు

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ప్రధాని కార్యాలయం: మోదీ ఏపీ పర్యటన కోసం ప్రధాని కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రధాని పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటుగా, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పంపారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా మీడియాకు అనుమతి లేకుండా చేశారు. ఇప్పటికే నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో భారీగా భత్రత ఏర్పాట్లు చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ నెల 16న సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

Last Updated :Jan 16, 2024, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.