kabaddi: ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన 48వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో.. 13 జిల్లాల నుంచి 600 మంది క్రీడాకారులు హాజరయ్యారు. బాలుర విభాగంలో తూర్పుగోదావరి, బాలికల విభాగంలో కృష్ణా జిల్లా జట్లు గెలుపొందాయి. విజేతలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బహుమతి ప్రదానం చేశారు.
సింథటిక్ మేట్స్పై ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఇక్కడ ఎంపికయిన జట్లను ఫెడరేషన్కు పంపి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని నిర్వహకులు పేర్కొన్నారు. పండగ సందర్భంగా కబడ్డీ పోటీలు ఉత్సాహాన్ని ఇచ్చాయని, మంచి ప్రతిభ గల క్రీడాకారులు మన రాష్ట్రంలో ఉన్నారని, వారిని ప్రోత్సహించడం హర్షణీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: