ETV Bharat / state

గోవా మద్యం కంటైనర్​ను పట్టుకున్న సెబ్ అధికారులు.. ఒకరు అరెస్ట్

author img

By

Published : Nov 11, 2021, 7:38 PM IST

ILLICIT LIQUOR
ILLICIT LIQUOR

గోవా నుంచి ప్రకాశం జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చేసిన తనిఖీల్లో కంటైనర్​లో తరలిస్తున్న 6,120 మద్యం సీసాలు పట్టుబడ్డాయి.

ఎస్ఈబీ అధికారుల తనిఖీల్లో లక్షల రూపాయలు విలువచేసే మద్యం పట్టుబడిన ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో జరిగింది. మద్యం అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం అందుకున్న ఎస్ఈబీ అధికారులు ఒంగోలు-వేటపాలెం బైపాస్ రహదారిలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఒంగోలు నుంచి కఠారిపాలెం క్రాస్ రోడ్డులో రొయ్యలు రవాణా చేసే కంటైనర్​ను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భారీగా మద్యం కేసులను గుర్తించారు.

కంటైనర్​లో పట్టుబడిన అక్రమ మద్యం వేటపాలెం మండలం పొట్టి సుబ్యయ్యపాలెంకు చెందిన ప్రళయ కావేరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. 156 బాక్సుల్లో 6,120 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సూపరింటెండెంట్​ ఆవులయ్య తెలిపారు. వీటిని గోవా(ILLICIT GOA LIQUOR CAUGHT BY SEB OFFICIALS) నుంచి అక్రమంగా తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడ్డ మద్యం విలువ రూ. 13.52 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కంటైనర్ డ్రైవర్​ను అరెస్టు చేసిన అధికారులు.. ప్రధాన నిందితుడు ప్రళయ కావేరి వెంకటేశ్వర్లును త్వరలోనే పట్టుకుంటామని ఆవులయ్య వెల్లడించారు.

ఇదీ చదవండి:

CHANDRABABU: పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి.. సీఎం భయపడుతున్నారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.