ETV Bharat / state

FARMER PROTEST: తన భూమిని కబ్జా నుంచి కాపాడాలని రైతు నిరసన

author img

By

Published : Sep 4, 2021, 3:30 PM IST

తన వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారంటూ ఓ రైతు కుటుంబం నిరసన చేపట్టింది. అందుకు సహకరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

FARMER PROTEST
FARMER PROTEST

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట వెంకటనరసయ్య అనే రైతు కుటుంబం పెట్రోల్‌ సీసాతో ఆందోళనకు దిగింది. జిల్లాలోని తోకపల్లిలో తమకున్న ఐదెకరాల భూమిని కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిని మరొకరికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని.. కబ్జాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'వెలిగొండ ప్రాజెక్ట్ పెండింగ్ బిల్లులన్నీ వెంటనే చెల్లిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.