కుదేలైన ఆక్వా రంగం.. పంట వేయలేని పరిస్థితుల్లో రైతులు

author img

By

Published : Mar 10, 2023, 10:43 AM IST

Aqua farmers

Aqua farmers: ప్రకాశం జిల్లాలో ఆక్వా రైతులు.. సాగుకు దాదాపు విరామం ప్రకటించే పరిస్థితి తలెత్తింది. పంటకు సరైన ధర లభించకపోవడం, విద్యుత్తు ఛార్జీల పెంపు, మేత ధరలతో.. సాగు చేయలేని స్థితిలోకి వెళ్లిపోయామని రైతులు చెబుతున్నారు. చెరువులను సిద్ధం చేసినా.. పంట వేసే ధైర్యం చేయలేకపోతున్నామని.. ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కుదేలైన ఆక్వా రంగం.. పంట వేయలేని పరిస్థితుల్లో రైతులు

Aqua farmers: ప్రకాశం జిల్లా తీరం వెంబడి దాదాపు 30వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు.. ప్రధానంగా వనామీ రొయ్య సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.. తీరం వెంబడి మరే పంటకు అనుకూలంగా లేకపోవడంతో ఈ పంటను మాత్రమే సాగు చేస్తున్నారు.. గత కొన్నాళ్లుగా ఒడుదుడుకుల మధ్య వనామీ సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.. చిన్న రైతులు నుంచి 50, 100 ఎకరాలు చెరువులు వేసిన రైతులు కూడా ఉన్నారు.. అయితే గత ఏడాది ధర విషయంలో కొనుగోలుదారులు నచ్చినట్లు వ్యవహరించడంతో వనామీ రైతులు ఇబ్బందులు పడ్డారు.. మేత, విత్తనం వంటివి అరువు పద్దతిపై కొనుగోలు చేసి, పంట తీత సమయంలో వచ్చే నగదుతో అప్పులు తీరుస్తూ సాగుచేస్తున్నారు. పంట ఖర్చులు బాగా పెరిగిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.. ప్రధానంగా విద్యుత్తు చార్జీలు రైతులకు పెనుభారంగా మారింది.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో యూనిట్‌ ధర రెండు రూపాయలు ఉన్న విద్యుత్తు చార్జీలు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం రూపాయిన్నరకు తగ్గించింది.. దీంతో ఆక్వా రైతుకు ఊరట కలగడమే కాకుండా, పంట విస్తీర్ణం పెరగడానికి కారణమైంది.. అయితే ఇది మూణ్ణాళ్ల ముచ్చటయ్యింది. గత ఏడాదన్నర కాలంలో విద్యుత్తు రాయితీ ఎత్తేసారు.. పైగా ట్రూ అప్‌ చార్జీలు పేరుతో మరికొంత బాదారు.. రూపాయిన్నర ఉన్న యూనిట్‌ ధర రూ 4.25 వరకూ పెరిగిపోయింది.. ఒక్క సారి మూడు రెట్లు పెరడం వల్ల పెనుబారంగా మారింది.. దీనికి తోడు మేత కిలో 71 రూపాయలు నుంచి 90- 95 రూపాయల వరకూ పెరిగిపోయింది.. ఇలా 100కౌంట్‌కు రొయ్యల సాగు ఖర్చులు దాదాపు 270 రూపాయలు అవుతుంది.. ప్రస్తుతం మార్కెట్‌ లో కిలో రొయ్యలు ధర 240-250 రూపాయల పలుకుతుంది... అంటే కిలోకు 20 రూపాయల వరకూ నష్టం ఏర్పడుతుంది... ఇలాంటి పరిస్థితుల్లో పంట వేసినా ధర వేసినా నష్టమే మిగులుతుందని ఎవరూ పంట వేయడం మానేసారు.

ఆక్వా జోన్‌ పరిధిలో ఉన్న వాళ్లకే విద్యుత్తు రాయితీ అని కొర్రీ పెడుతున్నారు.. అయితే ఆక్వా జోన్‌ నిర్ధారించడంలో అధికారులు నిర్థిష్టమైన విధానం అమలు చేయడంలేదు.. 10 ఎకరాలు లోపు, అదీ సర్వే నెంబర్‌లో పంట పొలాలు ఉండకూడదని, విద్యుత్తు వినియోగం పరిమితంగా ఉండాలని.. ఇలా వివిధ కారణాలు చూపుతూ అందరికీ రాయితీ లేని బిల్లులే మంజూరు చేస్తున్నారు.. దీని వల్ల లక్షలాది రూపాయలు చెల్లించుకోవలసి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఒక వేళ విద్యుత్తు అంతరాయం ఏర్పడితే డీజిల్‌ ఇంజన్లు వినియోగించుకుంటున్నారు.. దీని వల్ల అదనపు ఖర్చు.. ఈ బాధలన్నీ ఎందుకని పంట వేయడం మానేస్తున్నారు.. ఫలితంగా ఏరియేటర్లు, విద్యుత్తు మోటార్లు, తుప్పుపట్టి పనికిరాకుండా పోతున్నాయి.

కొందరు రైతులు ఖాళీగా ఉంచుకోలేక టైగర్‌ రొయ్యవైపు చూస్తున్నారు.. టైగర్‌ రొయ్యకు వనామీతో పోల్చి చూస్తే సాగు ఖర్చు తక్కువ.. అయితే 20 కౌంట్‌ వస్తేగానీ మంచి ధర పొందలేదు.. ఈ కౌంట్‌ రావాలంటే దాదాపు ఆరు నెలలు పాటు సాగుచేయాలి.. అన్ని రోజులు సాగు చేయాలంటే మేత, నిర్వహణా ఖర్చులు భారమవుతాయి.. టైగర్‌ వేసినా అంత ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు.. చెరువులు కాళీగా ఉండటం వల్ల ఈ సాగుపై ఆధార పడిన కూలీలకు కూడా పనులు తగ్గిపోయి, ఆదాయం కోల్పోవలసి వస్తుందని కూలీలు అంటున్నారు. ఆక్వా రంగానికి ప్రోత్సహిస్తూ, రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుస్తున్నామని ప్రభుత్వం ప్రగల్బాలు పలుకుంతుందని, కానీ మార్కెట్‌ విషయంలో గానీ, విద్యుత్తు రాయితీల విషయంలో గానీ ప్రభుత్వం ఏ రకంగా సహకరించడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.