ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Dec 17, 2022, 4:58 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • వైసీపీ అరాచకాలకు మాచర్ల ఘటనే నిదర్శనం : మాచర్ల టీడీపీ ఇంఛార్జ్​ బ్రహ్మారెడ్డి
    వైసీపీ అరాచకానికి మాచర్ల నియోజకవర్గ ఘటన నిదర్శనమని మాచర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్​ బ్రహ్మారెడ్డి ఆరోపించారు. వైసీపీ శ్రేణులు ఆయుధాలతో రాగా పోలీసులు జాడా ఎక్కడా కనిపించలేదని అన్నారు. వారు దాడీ చేసిన తర్వాతే పోలీసులు వచ్చారన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాచర్ల హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదు: ఎస్పీ రవిశంకర్ రెడ్డి
    మాచర్ల హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదని కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య నెలకొన్న ఫ్యాక్షన్‌ తగాదాల నేపథ్యంలోనే ఘటన జరిగిందని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు రెచ్చగొట్టే చర్యలు చేశారని ఎస్పీ అన్నారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతానికి మాచర్లలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రకాశం జిల్లాలో పంటలను మట్టిపాలు చేసిన మాండౌస్.. సాయం కోసం రైతన్నల ఎదురు చూపులు
    ప్రకాశం జిల్లాలో ఇటీవల మాండౌస్‌ తుపాను వల్ల పెద్ద మొత్తంలో పంటలు నష్టపోయాయి. చెరువులుగా మారిన పొలాల్లో నుంచి నీటిని బయటకు పంపేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ప్రక్రియ ఈనెల 27వ తేదీ కల్లా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అధికారులు, నేతల భూ దందా పై రెవెన్యూ మంత్రికి ఫిర్యాదు చేస్తా: కనుమూరి
    కృష్ణా జిల్లా బాపులపాడులో రెవెన్యూ అధికారులు భూ దందా తన దృష్టికి వచ్చిందని, అధికారులు నాయకులతో కుమ్మక్కై.. అవినీతికి పాల్పడుతున్నారని.. ఏపీఆర్డీసీ ఛైర్మన్‌ కనుమూరి సుబ్బరాజు ఆరోపించారు. మండలంలో మాజీ సైనికోద్యొగికి భూ కేటాయింపుకు వివరాలపై ఆరా తీస్తే, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించటం లేదని ఆయన మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యాచకురాలి పెద్ద మనసు.. జగన్నాథస్వామి గుడికి రూ.లక్ష విరాళం
    పేదరికంలో ఉండి భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఓ మహిళ.. తాను దాచిపెట్టిన సొమ్మును దానం చేసింది. జగన్నాథ స్వామి ఆలయ పునరుద్ధరణకు లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సుప్రీంకోర్టులో బిల్కిస్​ బానోకు చుక్కెదురు.. రివ్యూ పిటిషన్ కొట్టివేత
    గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దోషుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్​ను ధర్మాసనం కొట్టివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనాలో పెరుగుతున్న కరోనా​.. ఏప్రిల్​ 1 నాటికి గరిష్ఠ స్థాయిలో కేసులు..!
    వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి చైనాలో కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్' ఒక అంచనా విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్తి తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారా?.. వీటిని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే!
    కలలను సాకారం చేసుకునేందుకు మనం పొదుపు చేసిన డబ్బు సరిపోకపోవచ్చు. అయితే అలాంటి సందర్భాలలో ఆస్తి తనఖా పెట్టి రుణాలను తీసుకోవడం అనివార్యం కావచ్చు. అయితే ఈ తరహా రుణాలను తీసుకునేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించడం తప్పనిసరి. మరి ఆ అంశాలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND VS BAN: ముగిసిన నాలుగో రోజు ఆట.. విజయానికి చేరువలో టీమ్ఇండియా
    భారత్‌ బౌలర్లు రాణించడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లోనూ బంగ్లా తడబాటుకు గురైంది. నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి ఆరు వికెట్లను కోల్పోయి ఓటమికి చేరువగా వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జక్కన్న నెక్ట్స్​ భారీ స్కెచ్​.. ప్రభాస్​-ఎన్టీఆర్​ కాంబోలో పవర్​ఫుల్ మల్టీస్టారర్​!
    మహేశ్​బాబుతో సినిమా తర్వాత ప్రభాస్​-ఎన్టీఆర్​తో కలిసి మల్టీస్టారర్​ ప్లాన్ చేసేందుకు జక్కన్న ప్లాన్​ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.