ETV Bharat / state

'ఆక్సిజన్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. బాధితుల అవస్థలు తీర్చండి'

author img

By

Published : May 11, 2021, 6:00 PM IST

భాజపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్
భాజపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంపై నెల్లూరులో భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలు, కరోనా బులిటెన్ ను ఎప్పటికప్పుడు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కొవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడటంపై భాజపా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని, ఆక్సిజన్ సరఫరా పెంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని కోరారు. జిల్లాలో ఆక్సిజన్ రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసి బాధితుల అవస్థలు తీర్చాలని భాజపా సీనియర్ నేత మిడతల రమేష్ ప్రభుత్వానికి విన్నవించారు.

ఇవీ చూడండి:

నెల్లూరు: కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.