ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Dec 5, 2022, 5:05 PM IST

farmer suicide attempt
farmer suicide attempt

FARMER SUICIDE ATTEMPT: తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. తన పొలాన్ని ఆన్​లైన్​లో నమోదు చేయాలని అధికారులను అడిగినా పట్టించుకోక పోవడంతో దళారులను ఆశ్రయించి తన సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాడు. కానీ వాళ్లు కూడా మోసం చేయడంతో ఆవేదనకు గురయ్యాడు.

FARMER SUICIDE ATTEMPT: నెల్లూరు జిల్లా కొండాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పైడి దిబ్బయ్య అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొందరు దళారులు తనను మోసం చేశారని ఆవేదనతో కొండాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగు మందు తాగాడు. వెంటనే స్థానికులు దిబ్బయ్యను కలిగిరి ఆసుపత్రికి తరలించారు. తన పొలాన్ని ఆన్​లైన్​లో నమోదు చేయాలని అధికారులను కోరాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.