ETV Bharat / state

'ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఆత్మ నిర్భయ ప్యాకేజీ దోహదపడుతోంది'

author img

By

Published : Jul 10, 2020, 5:10 PM IST

'ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఆత్మ నిర్భయ ప్యాకేజీ దోహదపడుతోంది'
'ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఆత్మ నిర్భయ ప్యాకేజీ దోహదపడుతోంది'

అమెరికా, జపాన్ తరహాలో దేశం బలీయమైన శక్తిగా రూపొందేందుకు ప్రదాని మోదీ కృషి చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించటం అభినందనీయమన్నారు.

దేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఆత్మ నిర్భయ ప్యాకేజీ దోహదపడుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. విపక్షాలు ఈ ప్యాకేజీపై విమర్శలు చేస్తున్నా... ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించటం అభినందనీయమన్నారు. అమెరికా, జపాన్ తరహాలో దేశం బలీయమైన శక్తిగా రూపొందేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.

నెల్లూరు జిల్లాకు చెందిన డీఆర్​డీవో చైర్మన్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్లీలో అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిని నిర్మించటం అభినందనీయమని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.