ETV Bharat / state

నెల్లూరులో దారుణం.. వ్యక్తిపై డీజిల్ పోసి తగలబెట్టిన దుండగులు

author img

By

Published : Dec 17, 2022, 5:06 PM IST

Murder
హత్య

Murder: నెల్లూరు జిల్లా కలువాయి వెరుబొట్లపల్లిలో దారుణహత్య జరిగింది. ఓ వ్యక్తిపై డీజిల్ పోసి దుండగులు హత్య చేశారు. తెలుగుగంగ కాలువ వద్ద మృతదేహం లభ్యమయింది. పోలీసులు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Murder: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై డీజల్ పోసి అతికిరతకంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కలువాయి మండలం వెరుబోట్లపల్లి సమీపంలోని తెలుగు గంగ కాలువ వద్ద ఓ వ్యక్తిని డిజిల్ పోసి కాల్చివేసినట్లు మృతదేహాన్ని చూస్తే తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కలువాయి ఎస్ఐ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు ఆరా తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరులో వ్యక్తిని డీజిల్ పోసి తగలబెట్టిన దుండగులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.