ఒడిశా నుంచి జిల్లాలోకి మరో ఏనుగులు గుంపు

author img

By

Published : Feb 9, 2023, 11:29 AM IST

A Herd Of Elephants

A Herd Of Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలోకి ఒడిశా నుంచి మరో ఏనుగుల గుంపు ప్రవేశించింది. భామిని మండలం మనుమకొండ వైపు నుంచి ఈ ఏనుగులు రావడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టిస్తుండగా.. గజరాజుల దాడిలో ఇద్దరు మృత్యువాత కూడా పడ్డారు. కొత్త ఏనుగుల గుంపు రాకను జిల్లా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

A Herd Of Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలోకి ఒడిస్సా నుంచి మరో ఏనుగులు గుంపు బుధవారం ప్రవేశించింది. ఆరుగు ఏనుగులు పంపు పార్వతిపురం మంజూరు జిల్లా భామిని మండలం మనుమకొండ వైపు నుంచి జిల్లాలో ప్రవేశించాయి. ఇప్పటికే జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 9 ఏనుగులు ఓ గుంపుగా... నాలుగు ఏనుగుల గుంపు మరోవైపు సంచరిస్తున్నాయి. నాలుగు ఏనుగు దాడిలో నాలుగు రోజులు ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ఇప్పటికే జిల్లా ప్రజలు రెండు ఏనుగులు గుంపులతో ఆందోళన చెందుతుంటే మరో ఏనుగులు గుంపు జిల్లాలకు ప్రవేశించడంపై జిల్లా వాసులు భయాందోళన గురవుతున్నారు. కొత్త ఏనుగుల గుంపు జిల్లాలో ప్రవేశించిందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. బుధవారం తమ సిబ్బందిని పంపి ఏనుగులు గుంపు గమనిక నిఘా ఉంచామని అటవీశాఖ రేంజ్ అధికారి తవిటి నాయుడు తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు గుంపు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.