ETV Bharat / state

పల్నాడులో జనసేన కౌలురైతు భరోసా కార్యక్రమం.. పవన్​కు ఘన స్వాగతం

author img

By

Published : Dec 18, 2022, 12:52 PM IST

Grand welcome to Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. అయితే దీనికి ముందుగా దారిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పవన్​కు ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగానే పవన్ సమక్షంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరారు.

Janasena chief Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్

Grand welcome to Pawan: పల్నాడు జిల్లాలో ఆదివారం జనసేన కౌలురైతు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న జనసేన అధినేత పవన్​కల్యాణ్​కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మేడి కొండూరు మండలం పేరేచర్ల జంక్షన్​లో, కొర్రపాడులో దారిపొడవునా జన సైనికులు స్వాగతం పలికారు. అక్కడ పవన్​ను గజమాలతో సత్కరించారు. పవన్ కల్యాణ్​ను చూసేందుకు మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరాగా అభిమానులకు నమస్కారం చేస్తూ పవన్ ముందుకు సాగారు.

పల్నాడులో పవన్​కు ఘన స్వాగతం పలికిన అభిమానులు

జనసేనలో వైసీపీ నేతలు చేరిక :తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు జనసేనలో చేరారు. రాజోలు నియోకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. పి.గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరు కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యు కూడా జనసేనలో చేరారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్‌ వారికి సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.