ETV Bharat / state

Pulichintala project పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

author img

By

Published : Aug 17, 2022, 1:17 PM IST

Pulichintala project
పులిచింతల ప్రాజెక్టు

Pulichintala project పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జునసాగర్‌ నుంచి 3.42 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 13 గేట్లు ఎత్తి 3.24 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Pulichintala project పల్నాడు జిల్లా అచ్చంపేట వద్ద పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువన నాగార్జునసాగర్‌ నుంచి 3.42 లక్షల క్యూసెక్కుల వరద.. పులిచింతల ప్రాజెక్టులో వచ్చి చేరుతోంది. దీంతో.. 13 గేట్లు ఎత్తి 3.24 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు దిగువన నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.