ETV Bharat / state

Crops Damaged Due to Heavy Rains: పల్నాడు రైతులను నిండా ముంచిన వర్షాలు.. ప్రభుత్వ సాయానికై అన్నదాతల ఎదురుచూపులు..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 1:57 PM IST

Crops_Damaged_Due_to_Heavy_Rains
Crops_Damaged_Due_to_Heavy_Rains

Crops Damaged Due to Heavy Rains: ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి.. రెక్కలు ముక్కలు చేసి పండించిన పంట వర్షార్పణమైందని రైతులు లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Crops Damaged Due to Heavy Rains: అతివృష్టి.. అనావృష్టి ఏదైనా సరే అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చేదే. పంట చేతికొచ్చే వరకు రైతన్నలకు కునుకుండదు. చినుకు కోసం ఆకాశం వైపు.., మెులకెత్తే విత్తనం కోసం భూమి వైపు ఆశగా చూస్తారు. నెల కిందటి వరకు తీవ్ర వర్షాభావంతో ఎండిన పంటలు.. ఇటీవల కురిసిన భారీ వానలతో నీటిపాలయ్యాయి. పల్నాడు జిల్లాలో వందల ఎకరాల్లో ప్రత్తి, మిరప, మినుము, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు దిగాలు చెందుతున్నారు.

Farmers Worried About Crop Loss: ఇటీవల కురిసిన వానలు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం రైతులకు నష్టాన్ని కలిగించాయి. నరుకుళ్లపాడు, యండ్రాయి, పెదమద్దూరు వాగుల ఉద్ధృతికి.. నీరంతా పొలాల మీద పడ్డాయి. ప్రత్తి, మిరప, మినుము, బెండ సహా అనేక పంటలు నీట మునిగాయి. నీరు నిలబడిపోవడంతో మొక్కలన్నీ కుళ్లిపోయాయి. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి.. రెక్కలు ముక్కలు చేసి పండించిన పంట వర్షార్పణమైందని రైతులు లబోదిబోమంటున్నారు.

Crops Submerged in Flood కాల్వలను గాలికి వదిలేశారు.. పంటను వర్షాలకు వదిలేయాల్సి వచ్చింది!

Crop Damage Due to Rains: ఆ మధ్యకాలంలో వానలు పడకపోవడంతో.. ట్యాంకులతో నీరు తెచ్చి మరీ మిరప పంట వేశారు. నారు నాటిన రెండు వారాలకే.. భారీ వర్షం పడింది. దీంతో వాగులు ఉప్పొంగి పంటలను ముంచేశాయి. వందలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటే.. కనీసం చూసేందుకు వ్యవసాయాధికారులు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.

Farmers Facing Huge Loss Due to Heavy Rain: నాలుగేళ్లుగా పంట కాలువల పూడిక తీయకపోవడంతో.. డ్రైయిన్ల ద్వారా కృష్ణానదిలో కలవాల్సిన వరద నీరు పొలాల్లోకి వస్తోంది. పంట చేతికి రాకముందే నేల రాలిపోతున్నాయి. కాలువల్ని శుభ్రం చేయమని అధికారులను అడిగితే.. నిధుల్లేవని సమాధానం చెబుతున్నారని రైతులు మండిపడుతున్నారు. డ్రైయిన్లు బాగు చేసి రైతుల రెక్కల కష్టాన్ని నీటి పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Farmers Problems: అన్నదాతకు భరోసా ఇవ్వని పంటల బీమా.. ఆవేదనలో రైతన్న

"నెల కిందటి వరకు తీవ్ర వర్షాభావంతో ఎండిన పంటలు.. ఇటీవల కురిసిన భారీ వానలతో నీటిపాలయ్యాయి. వందల ఎకరాల్లో ప్రత్తి, మిరప, మినుము, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టి.. రెక్కలు ముక్కలు చేసి పండించిన పంట వర్షార్పణమైంది. నష్టపోయిన మా రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాము. దీంతోపాటు పంట కాలువల పూడిక తీయకపోవడంతో.. డ్రైయిన్ల ద్వారా కృష్ణానదిలో కలవాల్సిన వరద నీరు పొలాల్లోకి వస్తోంది. పంట చేతికి రాకముందే నేల రాలిపోతున్నాయి. కాలువల్ని శుభ్రం చేయమని అధికారులను అడిగితే.. నిధుల్లేవని సమాధానం చెబుతున్నారు." - రైతుల ఆవేదన

Crop loss in AP: కుదిపేసిన వర్షాలు.. దిక్కుతోచని స్థితిలో అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.