ఛీ.. మీరు పాలకులా?.. ట్విట్టర్​ వేదికగా మంత్రి అంబటిపై మండిపడ్డ చంద్రబాబు

author img

By

Published : Dec 20, 2022, 1:51 PM IST

CHANDRABABU FIRES ON AMBATI

CHANDRABABU FIRES ON AMBATI: మంత్రి అంబటి రాంబాబు లంచం అడిగారన్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఛీ.. మీరు పాలకులా అంటూ చంద్రబాబు ట్విట్టర వేదికగా మండిపడ్డారు. మరోవైపు లంచం అడిగనట్లు ఆరోపిస్తే రాజీనామా చేస్తానన్న అంబటి వ్యాఖ్యలపై జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిగో నీ లంచాల బాగోతం.. రాజీనామా ఎప్పుడు అని నిలదీస్తున్నారు.

CBN TWEET ON AMBATI : పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కుమారుడి మృతితో తురకా గంగమ్మ కుటుంబానికి వచ్చిన ప్రభుత్వ పరిహారాన్ని మంత్రి అంబటి అడిగారని వచ్చిన ఆరోపణలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఛీ.. మీరు పాలకులా అంటూ ట్వీట్ చేశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని మండిపడ్డారు. ఘటనపై ఈనాడు లో వచ్చిన కథనాన్ని చంద్రబాబు ట్వీట్​కు జత చేశారు.

సంబంధిత కథనం: 'కొడుకు చనిపోయి రూ.5లక్షలు వస్తే.. ఆ మంత్రి సగం ఇమ్మంటున్నారు'

ఇదిగో నీ లంచాల బాగోతం.. రాజీనామా ఎప్పుడు: మంగమ్మ లంచం డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే అంబటి రాజీనామా చేస్తానన్నారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాసయాదవ్​ గుర్తుచేశారు. ఇదిగో నీ లంచాల బాగోతం.. రాజీనామా ఎప్పుడు? అని ప్రశ్నించారు. రేపల్లె నుంచి పారిపోయి వచ్చినట్లు సత్తెనపల్లి నుంచి కూడా పారిపోయారా? ఎద్దేవా చేశారు. తురకా మంగమ్మ దంపతులకు వెంటనే పరిహారం చెక్కు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సాయంత్రానికి ఇవ్వకపోతే ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మంగమ్మ దంపతులకు హాని జరిగితే అంబటి రాంబాబుదే బాధ్యత అని తెలిపారు. గంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.