ETV Bharat / state

విజయవాడ మెట్రో.. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలే రాలేదన్న కేంద్రం

author img

By

Published : Dec 12, 2022, 7:27 PM IST

Vijayawada Metro: విజయవాడ మెట్రోపై కేంద్రం స్పందించింది. మెట్రో ఏర్పాటుపై కేంద్రానికి.. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని తెలిపింది. కొత్త మెట్రో విధానంపై ప్రతిపాదనలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని తెలిపింది.

Vijayawada Metro
విజయవాడ మెట్రో

Vijayawada Metro: విజయవాడ మెట్రోకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం తెలిపింది. మెట్రో ఏర్పాటుకు నిధుల సేకరణ, మొబిలిటీ ప్రణాళికను రాష్ట్రాలే తయారుచేయాలని కేంద్రం పేర్కొంది. టీడీపీ ఎంపీ కనకమేడల విజయవాడ మెట్రోపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి కౌశల్‌ కిషోర్‌ జవాబిచ్చారు. ప్రత్యామ్నాయ నివేదిక, డీపీఆర్‌ను రాష్ట్రాలే తయారుచేయాలని తెలిపింది. కొత్త మెట్రో విధానం మేరకు ప్రతిపాదనలు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పంపలేదని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.