ETV Bharat / state

గడువులోగా పోలవరం పూర్తి కావటం కష్టం: కేంద్రం

author img

By

Published : Dec 12, 2022, 4:52 PM IST

Updated : Dec 12, 2022, 6:51 PM IST

Central Government On Polavaram: పోలవరం ప్రాజెక్ట్​ నిర్మాణంపై కేేంద్ర జల్​శక్తిశాఖ వివరణ ఇచ్చింది. ఎంపీ సుభాష్​ చంద్రబోస్​ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్​ జల్​శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానిమిచ్చారు.

Polavaram
పోలవరం

Central Government On Polavaram: గడువులోగా పోలవరం ప్రాజక్ట్‌ పూర్తి కావడం కష్టమని కేంద్ర జల్‌శక్తి శాఖ మరోసారి స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పోలవరం పూర్తి కావాల్సి ఉందని.. అయితే పలు కారణాలరీత్యా ఆ పరిస్థితి కనిపించడం లేదని తేల్చిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. కేంద్ర జల్​శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానిమిచ్చారు. పోలవరానికి కేంద్రం ఇంకా రూ. 2 వేల 441 కోట్లు మాత్రమే ఇవ్వాల్సి ఉందని.. వివరించారు.

పోలవరానికి 2019 నుంచి రూ.6461 కోట్లు విడుదల చేశామని కేంద్రం తెలిపింది. 2013-14లో అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ ఖర్చు 29 వేల 027 కోట్లని.. 2017-18 అంచనాల ప్రకారం 47 వేల 725 కోట్లకు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులు పూర్తిగా కేంద్రమే చెల్లిస్తుందని వివరించింది. రూ.15 వేల 667 కోట్ల రూపాయల కాంపోనెంట్​ నిధులకు గాను రూ.13 వేల 226 కోట్లు చెల్లించామని కేంద్రం తెలిపింది. ఇంకా 2 వేల 441 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated :Dec 12, 2022, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.