ETV Bharat / state

కోడి పందేలపై మోహన్​బాబు కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Jan 14, 2023, 11:58 AM IST

Updated : Jan 14, 2023, 2:01 PM IST

Etv Bharat
Etv Bharat

Celebrities Participated in Bhogi : సంక్రాంతి సందడి రాష్ట్రంలో ప్రారంభమైంది. మూడు రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి ఉత్సవాలలో ప్రముఖులు ఉత్సహంగా పాల్గొంటున్నారు. భోగి వేడుకలలో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మంచు మోహన్​బాబు కోడిపందేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఘనంగా భోగి సంబరాలు.. పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు

Sankranthi Celebrations : రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు నిర్వహించుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి పండగను ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. భోగి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద చేరి సందడి చేశారు. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు మరవకుండా పండగలను నిర్వహించుకోవాలని వారు తెలిపారు.

భోగి వేడుకలలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. నెల్లూరులోని ఆయన స్వగృహంలో నిర్వహించిన భోగి వేడుకలలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఏ స్థాయిలో ఉన్న పండగలను కలసికట్టుగా జరుపుకోవాలని వెంకయ్యనాయుడు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సందడి చేశారు.

"మనం ఏ స్థాయిలో ఉన్న మన పండగలను మరిచిపోకూడదు. అందరం కలిసికట్టుగా పండగలను నిర్వహించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి పండగలు నిర్వహించుకోవాలి." - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బాలకృష్ణ భోగి వేడుకలలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం రావాలని.. రాష్ట్రంలోని ప్రజలు బాగుపడాలని ఆకాంక్షించారు.

వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగినది.. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ. నా ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని కోరుకుంటున్నా. -బాలకృష్ణ, ప్రముఖ సినీ నటుడు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్​బాబు యూనివర్సిటీలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్​బాబు హాజరయ్యారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో భోగి మంటలను ఏర్పాటు చేశారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రాంతంలో కోడి పందేలు తక్కువ. మొదట అవి తప్ప, ఒప్ప అని చూసుకుంటే అది మన ఆచారం. కత్తులు కట్టకుండా నిర్వహిస్తే బాగుండేది. ఎండ్లబండ్లు తక్కువే. ప్రతి ఒక్కరూ సంస్కృతి సంప్రదాయాలు మరచిపోకుండా పండగలను నిర్వహించుకోవాలని తెలిపారు. బంధువులు, స్నేహితులతో కలిసి పండుగలు నిర్వహించుకుంటే ఎనలేని అనభూతి కలుగుతుందని అన్నారు.

"మన సంస్కృతి సంప్రదాయాలు మరిచిపోకుండా పండగలను జరుపుకోవాలి. ఎక్కడ ఉన్న సరే పండగలను అందరూ ఒక దగ్గర చేరి నిర్వహించుకుంటే బాగుంటుంది. కోడి పందేలు కత్తులు కట్టకుండా నిర్వహిస్తే బాగుండేది. ఎడ్లబండ్ల పోటీలు కూడా ఉంటే బాగుండేది." -మంచు మోహన్​బాబు, ప్రముఖ సినీ నటుడు

రాష్ట్రంలోని ప్రజలకు మంచు విష్ణు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంతో ఉండాలని.. కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి పండగను కలిసి జరుపుకోవాలని అన్నారు.

"అందరికి సంక్రాంత్రి శుభాకాంక్షలు. గత చేదు జ్ఞాపకాలను వదిలేసి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లడానికి భోగిని జరుపుకుంటున్నాం. కొత్త చిత్రం మార్చిలో ప్రారంభం కాబోతుంది." -మంచు విష్ణు, సినీ నటుడు

ఇవీ చదవండి :

Last Updated :Jan 14, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.