ETV Bharat / state

మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా- కేసులు, భారీ జరిమానాలపై ముఠా కార్మికుల ఆవేదన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 4:15 PM IST

Medical_Contract_Employees_Dharna
Medical_Contract_Employees_Dharna

Medical Contract Employees Dharna: మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్​ని ఆప్కాస్​లో చేర్చాలని మున్సిపల్ కార్మికులకు ఇస్తున్నంత వేతనమే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ధర్నా చేపట్టారు. మరోవైపు ఉపాధి కోసం అప్పు చేసి లగేజీ ఆటోలు కొనుగోలు చేస్తే ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు, వేధింపులతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామని ముఠా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Medical Contract Employees Dharna: ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ శానిటేషన్ బెస్ట్ కంట్రోల్ సెక్యూరిటీ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్​లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్​ని ఆప్కాస్​లో చేర్చాలని మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న వేతనమే తమకూ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

16వేల రూపాయల వేతనం ఇవ్వాలని జీవో ఇచ్చినా.. కాంట్రాక్ట్ ఏజెన్సీలు మాత్రం 10వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా వేతనాలు చెల్లిస్తున్నారని, అవి కూడా సకాలంలో ఇవ్వడంలేదని వాపోయారు. ప్రభుత్వం మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ సమస్యలను పరిష్కరించి తమను ఆప్కాస్​లో చేర్చాలని డిమాండ్ చేశారు.

'ఆరోగ్యమిత్ర'లకు అన్నీ సమస్యలే! వేతన వెతలకు తోడు కొరవడిన ఉద్యోగ భద్రత

Workers Facing Problems in Vijayawada: మరోవైపు ఉపాధి కోసం పొట్టచేతపట్టుకొని విజయవాడ వచ్చిన ముఠా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజులో 14 నుంచి 16గంటలు పని చేస్తున్నా కుటుంబ పోషణ కష్టమవుతోందని ముఠా కార్మికులు వాపోతున్నారు. ఉపాధి కోసం అప్పు చేసి లగేజీ ఆటోలు కొనుగోలు చేస్తే ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు, వేధింపులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

ఐదో తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదు : ఏపీటీఎఫ్

రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ముఠా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. విజయవాడ నగరంలో సుమారు 7వేల మంది ముఠా కార్మికులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మంది వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన వారే.. వ్యాపార సముదాయాలకు అవసరమైన సరుకులు రవాణా చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

వివిధ వ్యాపార సముదాయాలకు సరుకులు తరలించే క్రమంలో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ముఠా కార్మికులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పోలీసు జరిమానాలు విపరీతంగా పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాసింజర్ ఆటోలు నడిపే వారికంటే దీనమైన జీవితం గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Municipal workers Chalo Vijayawada: సమాన పనికి సమాన వేతనమిచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తాం..: పారిశుద్ధ్య కార్మికులు

ప్రస్తుతం పెరిగిన ధరలు, పెరగని ఆదాయంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని ముఠా కార్మికులు గోడు వెల్లబుచ్చారు. ఖర్చులు పెరిగినా తమకు వేతనాలు పెంచడంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దెలు, అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు తమకు వచ్చే జీతం ఏమాత్రం సరిపోవడంలేదని వివరించారు. తాము పని చేస్తున్న క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగినా ఆదుకునే నాథుడే లేడని ముఠా కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ రక్షణ కోసం ఎటువంటి పథకాలు, చట్టాలు చేయలేదని వాపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.