ETV Bharat / state

Governor Abdul Nazir Speech in YSR Awards: రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: గవర్నర్ అబ్దుల్ నజీర్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 1:23 PM IST

Updated : Nov 1, 2023, 1:34 PM IST

Governor Abdul Nazir Speech in YSR Awards: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని.. 27 మందికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

Governor_Abdul_Nazir_Speech
Governor_Abdul_Nazir_Speech

Governor Abdul Nazir Speech in YSR Awards: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 'వైఎస్సార్ అవార్డుల' ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన (గవర్నర్‌) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రసంగిస్తూ.. 27 మంది అవార్డు గ్రహితలకు అభినందనలు తెలిపారు.

Governor Comments: ''ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సాగునీటి రంగం, వ్యవసాయం, వైద్యం, విద్య, 108 లాంటి సేవలు అందించిన వైఎస్అర్ ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఏపీలో మొదలుపెట్టిన ఈ 108 సేవలు.. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు వైఎస్అర్ కృషి చేశారు. ఆయన సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూడా కృషి చేశారు. వైఎస్సార్ చేసిన సేవలకు గాను ఆయన పేరిట 'వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైయస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు' ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ఇండికేటర్‌లలో ఏపీ అగ్రగామిగా ఉంది. 76 రెవెన్యూ డివిజన్‌లు, 108కి పైగా పోలీస్ సబ్ డివిజన్‌లు ఏర్పాటుతో పాలన సులభతరం అయ్యింది. ఏపీ ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.'' అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.

SKU 21st Convocation: సామాజిక రుగ్మతలపై విద్యార్ధులు పరిశోధనలు చేయాలి: గవర్నర్ నజీర్

Governor Awarded Awards to 27 People: అనంతరం వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌, 4 అచీవ్‌మెంట్‌ అవార్డులకు ఎంపికైన వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్..సీఎం జగన్‌తో కలిసి అవార్డులు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఆయన పురస్కారాలను అందజేశారు.

CM Jagan Comments: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మూడేళ్లుగా ఈ అవార్డులు అందించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఈ ఏడాది 27 మందికి వైఎస్సార్‌ అవార్డులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ హయంలో వ్యవసాయం, విద్యా, వైద్య రంగాల్లో విశేష అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.

World Red Cross Day: రెడ్​ క్రాస్ సేవలకు గుర్తింపు.. పలువురు కలెక్టర్లకు అవార్డులు

AP Incarnation Day Celebrations at CM Camp Office: ఇక, రాష్ట్ర అవతరణ వేడుకల విషయానికొస్తే.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యా­లయంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవత­రణ దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి హాజరయ్యి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం 'స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు' అనే పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.

CM Jagan Met With Governor గవర్నర్‌తో జగన్ భేటీ.. బిల్లుల ఆమోదం, ప్రస్తుత రాజకీయలపై చర్చ..

Last Updated : Nov 1, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.