ETV Bharat / state

విజయవాడ-హైదరాబాద్​ హైవేపై రెండు బస్సులు దగ్దం

author img

By

Published : Feb 26, 2023, 4:00 PM IST

APSRTC Buses Burnt
ఆర్టీసీ వెన్నెల బస్సులు దగ్దం

Fire accident at Hyderabad-Vijayawada highway : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని గుంపుల సమీపంలో ఏపీఎస్​ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు మంటల్లో చిక్కుకుని దగ్దమయ్యాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయల్దేరిన వెన్నెల బస్సు.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మరమ్మతుకు గురై నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను వేరే బస్సులో పంపించిన సిబ్బంది.. బస్సు మరమ్మతు కోసం మరో బస్సును రప్పించారు. మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా బ్యాటరీలో మంటలు చెలరేగి బస్సులు దగ్ధమయ్యాయి.

మంటల్లో చిక్కుకుని రెండు ఆర్టీసీ వెన్నెల బస్సులు దగ్దం

APSRTC Buses Burnt : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్​ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరిన వెన్నెల బస్సులో గుంపుల గ్రామ సమీపానికి రాగానే సాంకేతిక సమస్య తలెత్తింది.

బ్యాటరీలో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లంతో బస్సు లైట్లు ఆఫ్ అయ్యాయి. లెట్లు రాకపోవటంతో.. ప్రయాణికులను వేరే బస్సులలో పంపించేశారు. ఆ తర్వాత ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పించారు. వైర్ల సహాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ లోపు మరమ్మతు కోసం వచ్చిన బస్సులో పెద్ద శబ్ధం వచ్చింది. ఏమైందోనని వెళ్లి చూడగా.. ఆ బస్సులో మంటలు చెలరేగాయి.

ఆ మంటలే మొదటి బస్సుకు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు బస్సుల్లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పదని సిబ్బంది తెలిపారు. ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇదే కాకుండా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇల్లెందు మండలం బాలాజీనగర్​కు చెందిన పంచాయతీ వార్డు సభ్యుడు కోటికి చెందిన కారు మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న కారు పూర్తిగా కాలిపోగా.. దాని వెనకలే నిలిపి ఉంచిన మరో కారు స్వల్పంగా దెబ్బతింది. ఉద్దేశపూర్వకంగానే నలుగురు దుండగులు.. తన కారును దగ్ధం చేశారని కోటి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గంలో విభేదాలతో పంచాయతీ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.