ETV Bharat / state

ఇన్‌ఛార్జుల మార్పుపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి- పనిచేయని బుజ్జగింపులు- పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 10:03 PM IST

Updated : Jan 5, 2024, 10:13 PM IST

Etv Bharat
Etv Bharat

CM Jagan Meets MLAs on Ticket: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ నియోజకవర్గాల్లో చేపట్టిన ఇంఛార్జుల మార్పు అధికార పార్టీలో గుబులురేపుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను ప్రకటించిగా, శుక్రవారం పిలుపు అందుకున్న ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై బాహాటంగానే అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సహా మరికొంత మంది కీలక నేతలు జగన్ వైఖరిని తప్పుబట్టారు. ఏనాడు పార్టీ గీతను దాటని తమను, సర్వేల పేరుతో తమను బయటకు పంపడం దారుణమని వాపోయారు.

CM Jagan Meets MLAs on Ticket: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపు గుర్రాల పేరుతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఇంఛార్జ్​ల మార్పు కసరత్తు అధికార వైఎస్సార్సీపీలో వేడిరాజేస్తోంది. సర్వేల పేరుతో ఇప్పటికే రెండు దఫాలుగా 38 నియోజకవర్గాలకు సమన్వయకర్తలను మార్చిన సీఎం జగన్, మరికొంత మందిని మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్ తీరుపై అసంతృప్తి గళాన్ని విప్పుతున్నారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన నేతల్లో కొందరు అధిష్ఠానంపై బాహాటంగానే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏనాడు పార్టీ గీతను దాటని తాము, తమ నియోజవర్గాలకు ఎందుకు దూరం కావాలని ఆవేదనకు గురయ్యారు.

CM Jagan Exercises on In-charge Changes: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకీ రాజీనామా చేసిన రోజు మొదలుకొని ఈరోజు వరకు సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పుపై కసరత్తులు కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం (డిసెంబర్ 12, 2023)న 11 నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను మార్చుతూ మొదటి జాబితాను విడుదల చేసిన సీఎం జగన్, జనవరి 2, 2024న 27 మందితో కూడిన రెండవ జాబితాను విడుదల చేశారు. దీంతో 38 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జిలను ప్రకటించారు.

మరిన్ని మార్పులు ఖాయమంటున్న వైసీపీ అధిష్ఠానం - తాడేపల్లిలో చర్చోపచర్చలు

YSRCP Chief Leaders Came to CMO: నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు పరంపరలో భాగంగా శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మరికొంతమంది నేతలకు పిలుపు వచ్చింది. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అనంతరం సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

YSRCP Leaders Fire on CM Jagan: ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 38 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చడంతో సీఎం జగన్‌పై పార్టీ శ్రేణులు, నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను మార్చేందుకు సిద్ధమవ్వడంతో ఈసారి ఎవరెవరిని మార్చబోతున్నారని నేతలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ పార్టీ, వైఎస్ జగన్ కోసం పని చేసిన తమకు టికెట్లు ఇవ్వడలేదంటూ అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ ఇన్‌ఛార్జుల మార్పుపై కొనసాగుతున్న కసరత్తు - సీఎంవోకి ప్రజాప్రతినిధులు 'క్యూ'

CM Jagan Appeased the Leaders: తాడేపల్లి సీఎంవోకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలను బుజ్జగించేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. నరసారావుపేట ఎంపీ లావుకృష్ణదేవరాయలును పిలిచి, సీటు విషయమై మాట్లాడారు. ఆ తర్వాత గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మార్పుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఇటీవలే ప్రకటించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అసంతృప్తితో ఉన్న అన్నా రాంబాబును సీఎం బుజ్జగించినట్లు తెలిసింది. తనకు నరసారావుపేట సీటు ఖరారైందని, వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే తాను పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.

Darshi MLA Maddisetty Comments: ''ఈరోజు సీఎం జగన్‌ను కలిశాను. దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మార్పుపై చర్చించాను. సీఎం కొన్ని సూచనలు చేశారు. నేను కొన్ని చెప్పా. మరో నియోజకవర్గానికి వెళ్లాలని అంటున్నారు. సీఎం కొన్ని చెప్పి, ఆలోచించి చెప్పామన్నారు. సర్వేల గురించి నాకేమీ చెప్పలేదు. సీటు గురించి రెండు, మూడ్రోజుల్లో చెబుతామన్నారు. రెండు, మూడ్రోజుల్లో మరోసారి సీఎంను కలుస్తా. జనసేన, ఇతర పార్టీలేవీ నన్ను సంప్రదించలేదు. నేను కూడా ఏ పార్టీ వారినీ సంప్రదించలేదు. టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచిస్తా'' అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు.

MLA Kapu Ramachandra Reddy Comments: తాను వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయనకు సీఎం జగన్ అపాయిమెంట్ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తి గురయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ '' ఈరోజు జగన్‌ను కలిసేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్‌ లేదని సజ్జల చెప్పారు. జగన్‌ను నమ్ముకుని నేను కాంగ్రెస్‌ నుంచి వచ్చా. నాకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి, ఇవ్వలేదు. వైసీపీ కోసం గడప గడపకూ తిరిగాను. జగన్‌ చెప్పిన ప్రతి పని చేశాను. సర్వే పేరు చెప్పి టికెట్‌ ఇవ్వలేమనడం నాకు బాధగా అనిపించింది. వైసీపీ నుంచి మేం వెళ్లిపోతున్నాం. కల్యాణదుర్గం నుంచి నేను, రాయదుర్గం నుంచి నా భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తాం. మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి.'' అని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరి టికెట్ చిరుగుతుందో! - జగన్​ క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేల నిరీక్షణ

Last Updated :Jan 5, 2024, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.