ETV Bharat / state

హైకోర్టు సంచలన నిర్ణయం - ఎన్నికల వేళ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతానికి చర్యలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 8, 2023, 9:14 PM IST

AP High Court Suo Moto PIL Against Public Representatives Cases: ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులలో విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జాప్యాన్ని నివారించే నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక చర్యలు ప్రారంభించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం పిల్‌పై విచారణ జరిపింది. ఏజీ అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను వాయిదా వేసింది.

AP_High_Court_Suo_Moto_PIL_Against_Public_Representatives_Cases
AP_High_Court_Suo_Moto_PIL_Against_Public_Representatives_Cases

AP High Court Suo Moto PIL Against Public Representatives Cases : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులలో విచారణను సుప్రీకోర్టు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణను వేగం పెంచేందుకు ఏపీ హైకోర్టు చర్యలు మొదలు పెట్టింది.

AP HC Measures to Speed Up Cases MPs and MLAs : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులలో విచారణలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జాప్యాన్ని నివారించే నిమిత్తం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక చర్యలు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, హైకోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రత్యేక కోర్టును వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం పిల్‌పై విచారణ జరిపింది. ఈ పిల్‌పై విచారణను సాగించేందుకు అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) హాజరు తప్పనిసరి అని ధర్మాసనం తెలిపింది. ఏజీ అందుబాటులో లేరని, లేరని ప్రత్యేక పీపీ వివేకానంద బదులు ఇచ్చారు. సోమవారం అందుబాటులోకి వస్తారని అన్నారు. విచారణను వాయిదా వేయాలని కోరారు.

ప్రజాప్రతినిధుల కేసులపై సుప్రీంకోర్టు తీర్పు - సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌తో ముఖాముఖి

Supreme Court on Public Representatives Cases : ధర్మాసనం స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే సంబంధిత కోర్టుకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉందని తెలిపింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలలో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు 2023 నవంబర్‌ 09న పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ట్రయల్‌ కోర్టులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప విచారణలను వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది.

HIGH COURT ON PUBLIC REPRESENTATIVES CASES : ప్రజాప్రతినిధుల కేసుపై...హైకోర్టు విచారణ

ట్రయల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల కేసుల వివరాలను వేగంగా ముగించేందుకు హైకోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్మాసనం తగిన ఆదేశాలు, నిర్దేశాలు జారీ చేస్తుండాలని తెలిపింది. కేసుల విచారణలో పురోగతిపై ప్రత్యేక కోర్టు నుంచి హైకోర్టు ధర్మాసనం నివేదిక కోరవచ్చని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులలో తొలుత మరణ, యావజ్జీవ శిక్షపడే అవకాశం ఉన్న కేసులు, ఆ తర్వాత ఐదేళ్లు అంతకు మించి శిక్షపడే కేసుల విచారణకు ట్రయల్‌ కోర్టులు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.

అనంతరం మిగతా కేసులపై విచారణ జరపాలంది. స్టేలు ఉన్న కేసుల జాబితాను రూపొందించి హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొంది. స్టేలు ఎత్తివేయడంతో పాటు ట్రయల్‌ (విచారణ) ప్రారంభానికి ఉన్న అవరోధాలను తొలగించాలంది.

Prathidwani ప్రజా ప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు తొందరెందుకు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.