ETV Bharat / state

రెవిన్యూ వ్యవస్థలో సమూల మార్పులు: మంత్రి బుగ్గన

author img

By

Published : Sep 29, 2019, 6:35 PM IST

అవినీతితో నిండిపోయిన రెవిన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చి అసలైన యజమానులకే భూమి హక్కులు కల్పిస్తామని వెల్లడించారు.

minister buggana

బహిరంగ సభలో మంత్రి బుగ్గన ప్రసంగం

రెవిన్యూ వ్యవస్థలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకొస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అవినీతిని రూపుమాపుతామని స్పష్టం చేశారు. త్వరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్​ను తెస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రూ. కోటి 23 లక్షలతో నిర్మించిన తహశీల్దార్ కార్యాలయం, గ్రంథాలయ భవనాన్ని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సభలో బుగ్గన మాట్లాడారు. గత ప్రభుత్వం విద్యుత్తు బకాయిలు చెల్లించకపోవటమే కరెంట్ కోతలకు కారణమన్నారు. త్వరలో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ నిరుద్యోగులకు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు కల్పించారన్నారు.

Intro:కోర్టు ప్రారంబంBody:యాంకర్ వాయిస్: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా సివిల్ జడ్జి కోర్టు ను ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ న్యాయమూర్తి డివి ఎస్ఎస్ సోమయాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కోర్టు భవనాన్ని ప్రారంభించి ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సివిల్ జడ్జి కోర్టు ఆత్మకూరు పట్టణంలో ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. మొత్తం 600 కేసులు ఉన్నాయని త్వరితగతిన పరిష్కరిస్తారని అన్నారు. ఈ కోర్టు ద్వారా కక్షిదారులకు సత్వర పరిష్కారం అవుతుందని అన్నారు. న్యాయవాదులు అందరితో సఖ్యత గా ఉంటూ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రజలు క్షణికావేశానికి లోనై గొడవలకు దిగకుండా సమస్యలను కొని తెచ్చుకోవద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతియుత భావం అలవర్చుకొని ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, జిల్లా ఎస్పీ ఐశ్వర్య రాస్తోగి, తదితరులు పాల్గొన్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.