ETV Bharat / state

RECORD: రికార్డు ధర పలికిన పత్తి...క్వింటాలు ఎంతంటే..

author img

By

Published : Oct 1, 2021, 10:32 PM IST

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రికార్డ్ స్థాయి ధరకు అమ్ముడుపోయింది. క్వింటాలు పత్తి ధర గరిష్ఠంగా రూ. 8169, కనిష్ఠంగా రూ. 5000 పలికింది.

పత్తి
పత్తి

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి రికార్డ్ స్థాయి ధరలకు అమ్ముడుపోయింది. శుక్రవారం నాడు క్వింటాలు పత్తి ధర గరిష్ఠంగా రూ. 8169, కనిష్ఠంగా రూ. 5000 పలికింది. పత్తి ధరలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. యార్డుకు 8790 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు.

పత్తి గింజలు ధరలు పెరగడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలలో పత్తికున్న ధరలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లోని ఆదోనిలో అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారస్తులు అంటున్నారు.


ఇదీ చదవండి: ఆదోనిలో రికార్డు స్థాయిలో పెరిగిన పత్తి ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.