ETV Bharat / state

గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఒకరు మృతి

author img

By

Published : Mar 1, 2021, 3:49 PM IST

గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఒకరు మృతి
గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఒకరు మృతి

గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న కోసిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా కోసిగిలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో నర్సన్న అనే వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నర్సన్నపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆదోనీ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఈ రోజు ఉదయం కన్నుమూశాడు. ఆసుపత్రి వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. డీఎస్పీ వినోద్ కుమార్ బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు.. 5 ఇసుక లారీలు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.