ETV Bharat / state

భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు లక్ష దీపోత్సవం

author img

By

Published : Nov 24, 2020, 11:54 AM IST

Laksha Dipotsavam srisailam
శ్రీశైలంలో లక్షదీపోత్సవం

శ్రీశైలం పుణ్య క్షేత్రంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, లక్ష దీపోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధన చేశారు.

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివునికి ప్రీతికరమైన సోమవారం సందర్భందా.. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, లక్ష దీపోత్సవం నిర్వహించారు.

ఆలయ పుష్కరిణి వద్ద స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దేవస్థానం అర్చకులు నవ విధ హారతులు సమర్పించారు. పుష్కరిణికి సైతం హారతులు ఇచ్చారు. లక్ష దీపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కార్తీక దీపారాధన చేశారు.

ఇవీ చూడండి:

ఐదో రోజుకు తుంగభద్ర పుష్కరాలు...పెద్దగా హాజరుకాని భక్తులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.