ETV Bharat / state

'వైకాపా నేతలకు తెదేపా అంటే భయం'

author img

By

Published : Jan 3, 2021, 3:58 AM IST

kurnool tdp leaders protests
నిరసన తెలుపుతున్న కర్నూలు తెదేపా నేతలు

తెదేపా అంటే అధికార పార్టీ నాయకులకు భయం కాబట్టే చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెదేపా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా కర్నూలులో ఆయన నిరసన చేపట్టారు.

రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని తెదేపా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా కర్నూలులో శనివారం ధర్నా చేపట్టారు. దేవుళ్లతో పెట్టకోవడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. తెదేపాని చూసి వైకాపా నేతలు భయపడుతున్నారు కాబట్టే.. రామతీర్థం వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.

ఇదీ చదవండి:

రామతీర్థం ఘటన వెనుక తెదేపా హస్తం: మంత్రి వెల్లంపల్లి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.