ETV Bharat / state

218 సీసాల తెలంగాణ మద్యం పట్టివేత

author img

By

Published : Apr 7, 2021, 10:28 PM IST

అధికారుల కళ్లుగప్పి చేస్తున్న మద్యం అక్రమ రవాణాను.. కర్నూలు ఎస్​ఈబీ సిబ్బంది అడ్డుకున్నారు. పంచలింగాల చెక్​పోస్టు వద్ద ఆటోలో తరలిస్తున్న 218 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

telangana liquor caught at panchalingala, seb caught telangana liquor at panchalingala
పంచలింగాల వద్ద తెలంగాణ మద్యం ప్టటివేత, తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్​ఈబీ సిబ్బంది

కర్నూలు సరిహద్దుల్లోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎస్​ఈబీ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వడ్డె రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన ఆటోలో సీట్ల మధ్య ఉంచి రవాణా చేస్తున్న సరుకును గుర్తించారు. 218 మద్యం సీసాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లక్ష్మీ దుర్గయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

భానుడి ఉగ్రరూపం.. రాయలసీమ బేజారు!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.