ETV Bharat / state

కర్నూలులో ఎంపీపీ స్థానం రూ.కోటి?

author img

By

Published : Mar 13, 2020, 8:13 AM IST

కర్నూలు జిల్లాలో ఓ ఎంపీపీ స్థానానికి మంచి గిరాకీ ఏర్పడింది. దీనిని సొమ్ము చేసుకోవాలని భావించిన ఓ పార్టీ ప్రజానిధి బేరానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి చెల్లించేందుకు అంగీకరించిన వ్యక్తికి బీ-ఫారం ఇచ్చేందుకు సమ్మతించినట్లు సమాచారం.

kurnool mpp
kurnool mpp

కర్నూలు జిల్లాలోని ఓ పార్టీ ప్రజాప్రతినిధి స్థానిక సంస్థల పదవులకు రాయ‘బేరాలు’ సాగిస్తున్నారని తెలుస్తోంది. తమ పార్టీ తరఫున ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు కావాలంటే ఒక్కో పదవికి రూ.కోటి ఇవ్వాలని డిమాండు చేసినట్లు సమాచారం. కొందరు వెనక్కు తగ్గగా, కొన్ని స్థానాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. ఓ ఎంపీపీ పదవిపై ఒకరు రూ.50 లక్షలు, మరొకరు రూ.80 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా చివరకు రూ.కోటి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న వ్యక్తికి బీ-ఫారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:పురపోరు: కోలాహలంగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.