ETV Bharat / state

ఉద్యోగులతో ప్రభుత్వం-ఆర్ధికశాఖ ఆటలు.. రూ.2400కోట్ల భవిష్యనిధి మళ్లింపుపై ఆదేశాలు!

author img

By

Published : Mar 30, 2023, 5:25 PM IST

Electricity Employees' Provident Fund : విద్యుత్ ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై ప్రభుత్వం కన్నేసిందా..? ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​లో దాచుకున్న సొమ్ము కాజేసేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్ కో, విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు.. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​లో దాచుకున్న భవిష్య నిధి మెచ్యూరిటీ తీరింది. మొత్తం 2400కోట్లు ఏపీ బేవరేజస్ కార్పోరేషన్​లో పెట్టుబడులుగా పెట్టాలంటూ ఆర్థిక శాఖతో పాటు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

Etv Bharat
Etv Bharat

Electricity Employees' Provident Fund : ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్ కో, విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు.. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​లో దాచుకున్న మొత్తాలు మెచ్యూర్ కావటంతో ఆ నిధుల్ని కూడా కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 2400 కోట్ల రూపాయల మొత్తాన్ని ఏపీ బేవరేజస్ కార్పోరేషన్​లో పెట్టుబడులుగా పెట్టాలంటూ ఆర్థిక శాఖతో పాటు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.

బేవరేజస్ కార్పోరేషన్ లో పెట్టాలంటూ.. విద్యుత్ సంస్థల ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ట్రస్టు, గ్రాట్యుటీ ట్రస్టుకు చెందిన నిధుల్ని ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ లో పెట్టుబడులుగా పెట్టాలంటూ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ లో పెట్టిన ఈ మొత్తాలు మెచ్యూర్ కావటంతో తాజాగా వాటిని బేవరేజస్ కార్పోరేషన్ కు మళ్లించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగులకు చెందిన భవిష్యత్ మొత్తాల విషయంలో ప్రభుత్వం- అర్థిక శాఖలు ఆటలాడుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కన్నేసిన ప్రభుత్వం.. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్ కో, విద్యుత్ పంపిణీ సంస్థల్లోని ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై ప్రభుత్వం కన్నేసింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​లో వారు దాచుకున్న మొత్తాలు మెచ్యూర్ కావటంతో ఆ నిధుల్ని కూడా కాజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 2400 కోట్ల రూపాయల మొత్తాన్ని ఏపీ బేవరేజస్ కార్పోరేషన్​లో పెట్టుబడులుగా పెట్టాలంటూ ఆర్థిక శాఖతో పాటు పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. విద్యుత్ సంస్థల ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ట్రస్టు, గ్రాట్యుటీ ట్రస్టులో మార్చి 27 తేదీ నాటికి వివిధ మొత్తాలు మెచ్యూర్ కావటంతో ఆ నిధుల్ని ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ లో పెట్టి వాటిని మళ్లించేందుకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ నెల 27నాటికి మెచ్యూర్.. విద్యుత్ సంస్థల ఉద్యోగులు ప్రతీ నెలా చెల్లించిన పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తాలు పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్​లో పెట్టుబడులుగా పెట్టారు. వడ్డీతో కలిపి మొత్తం 2400 కోట్ల రూపాయలు ఈ నెల మార్చి 27తేదీ నాటికి మెచ్యూర్ అయ్యాయి. ఏపీ జెన్ కో ఉద్యోగులకు చెందిన 1500 కోట్ల రూపాయలు, ఏపీ ట్రాన్స్ కో ఉద్యోగులకు చెందిన 300 కోట్లు , ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థలోని ఉద్యోగుల భవిష్య నిధి 150 కోట్లు, అలాగే ఎస్పీడీసీఎల్ కు ఉద్యోగులకు చెందిన 300 కోట్లు, సీపీడీసీఎల్ కు చెందిన మరో 300 కోట్లు మొత్తంగా 2400 కోట్ల రూపాయలు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మెచ్యూర్ అయ్యాయి. అయితే, ఈ మొత్తాన్ని ఏపీ బేవరేజస్ కార్పోరేషన్ కు చెందిన బాండ్లలో పెట్టాలంటూ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. వాస్తవానికి ఈ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కాకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై 8.5 శాతం వడ్డీ కూడా ఇస్తామంటూ ఆయా సంస్థలపై ఆర్థిక శాఖ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాండ్లేవీ లిస్టు కాకపోవటంతో అవి ఎంతవరకూ సురక్షితం అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

నిధులు వాడుకున్న ప్రభుత్వం.. వాస్తవానికి విద్యుత్ సంస్థలకు చెందిన ఉద్యోగులు నెలనెలా దాచుకున్న పీఎఫ్ గ్రాట్యుటీ మొత్తాలను ఆయా సంస్థలు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వద్ద పెట్టుబడులుగా పెట్టాయి. దీనికి 9.6 శాతం మేర వడ్డీ కూడా చెల్లించారు. ఈ నెల 27తో గడువు ముగియటంతో వాటిని చెల్లించాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వద్ద ఆ నిధులు పెట్టినా... వివిధ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధుల్ని వినియోగించుకుంది. ప్రస్తుతం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి ఆ నిధుల్ని సాంకేతికంగా బేవరేజస్ కార్పోరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టినట్టుగా బదలాయించాలని ఆర్థికశాఖ ప్రయత్నాలు చేస్తోంది. బాండ్లకు గ్యారెంటీ లేకపోవటం, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ చెల్లించిన వడ్డీకంటే బేవరేజస్ కార్పోరేషన్ బాండ్ల వడ్డీ ధర తక్కువ కావటంపై విద్యుత్ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.