ETV Bharat / state

'తాడేపల్లి ప్యాలెస్​లో రాసిచ్చిన స్క్రిప్ట్​నే చదువుతున్నారు'

author img

By

Published : Dec 27, 2020, 10:56 PM IST

వైకాపా ఎంపీ నందిగం సురేష్​ వ్యాఖ్యలపై తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయి తెలుసుకుని నందిగం సురేశ్ మాట్లాడాలని హెచ్చరించారు.

tdp leader pilli manikyalarao fire on ycp mp nandigam suresh
తెదేపా నేత పిల్లి మాణిక్యాలరావు

వైకాపా ఎంపీ నందిగం సురేష్... తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు హెచ్చరించారు. సొంత నియోజకవర్గంలో రాజధాని వద్దనుకుంటున్న వ్యక్తి నందిగం సురేష్ అని దుయ్యబట్టారు. ఎస్సీలు ఆర్థికంగా ఎదగడం, గౌరవంగా బతకడం ఇష్టం లేదా అని మాణిక్యాలరావు ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్​లో రాసిచ్చిన స్క్రిప్ట్​నే నందిగం సురేష్ చదువుతున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.