ETV Bharat / state

TDLP meeting decided to go to the assembly అసెంబ్లీకి హజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం.. చంద్రబాబు అరెస్టుపై సభలోనే తేల్చుకుందామన్న నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 2:03 PM IST

Updated : Sep 20, 2023, 8:06 PM IST

tdlp_meeting_decided_to_go_to_the_assembly
tdlp_meeting_decided_to_go_to_the_assembly

TDLP meeting decided to go to the assembly : పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు... ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ స్పష్టం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో వర్టికల్​గా పాల్గొన్న ఆయన.. చంద్రబాబు అక్రమ అరెస్టు అంశంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదని పేర్కొన్నారు.

TDLP meeting decided to go to the assembly : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు... ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు(Chandrababu Illegal Arrest) అంశంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదని లోకేశ్ పేర్కొన్నారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేద్దాం.. వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దాం అని చెప్పారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

AP Police Special Rules : నేరారోపణ లేకుండానే జైలు..! ఇదీ ఏపీలో తాజా పరిస్థితి

సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలని సమావేశం నిర్ణయించింది. మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలిపి ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని శాసనసభ పక్షం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం నేతలు అసెంబ్లీ కి వస్తే 70ఎంఎం స్క్రీన్ చూపిస్తామంటూ మంత్రుల వ్యాఖ్యలపైనా సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశం ఇస్తే.. జగన్ అక్రమాస్తుల కేసు (Jagan's embezzlement case) లపై స్క్రీన్ ప్రెజెంటేషన్ కు పట్టుబట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. సభ లోపల అవకాశం ఇవ్వకపోతే జగన్ అవినీతి బాగోతాన్ని బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఇంకా తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా అసెంబ్లీ లోపల, బయటా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు.

TDP Pattabhi on APSSDC : 'స్కిల్ డెవలప్​మెంట్' కేసు కుట్ర.. వాస్తవాలతో ప్రజల్లోకి వెళ్తాం.. : పట్టాభి

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan) లో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరైయ్యారు. లోకేశ్, బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప జూమ్ ద్వారా టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ సహా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు మరీ అతిగా ప్రవర్తిస్తున్నారని సమావేశంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

దిల్లీలో ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా చట్ట సభ వేదికను వదులుకోకూడదని, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని తాజా పరిణామాల పై నిలదీయాల్సిందే అనే భావన వ్యక్తమైంది. చంద్రబాబుతో ములాఖత్ సమయంలో సీనియర్ నేత యనమల అసెంబ్లీ సమావేశాల ప్రస్తావన తెచ్చినప్పుడు... మన గళం వినిపించేందుకు చట్టసభల వేదికను వాడుకోవాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. సభ నుంచి సస్పెండ్ చేస్తే మీడియా ద్వారా పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. అధినేత సూచనలకు అనుగుణంగానే ఇవాళ జరిగే శాసనసభ పక్ష సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

IT Employees Protest in Chennai చెన్నైలో ఐటీ ఉద్యోగుల నిరసనలు.. సైకో పోవాలి.. సైకిల్ రావాలి అంటూ ఆందోళనలు

Last Updated :Sep 20, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.