ETV Bharat / state

పరిశ్రమల కోసం భూములిచ్చాం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తున్నాం..!

author img

By

Published : Jan 4, 2023, 8:49 AM IST

Updated : Jan 4, 2023, 9:11 AM IST

Narla Tatarao Thermal Power Station: అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే.. అవే ప్రజలకు శాపంగా మారితే.. దాని పర్యవసనాలు వర్ణానాతీతం. అదే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి. థర్మల్‌ విద్యుత్‌ పరిశ్రమ నుంచి వెలువడిన బూడిద రవాణాతో.. కాలుష్యం పెరిగి స్థానికులు అనారోగ్యాలబారిన పడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా..స్పందన కరవైందని వాపోతున్నారు.

నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం
నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం

Narla Tatarao Thermal Power Station: విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో పాటించాల్సిన కనీస నియమాలు పాటించకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ ట్రక్కుల్లో బూడిదను తరలించటంతో.. చుట్టుపక్కల గ్రామాలు దుమ్ము మయమవుతున్నాయి. పరిమితిని మించి పరిశ్రమ నుంచి బూడిదను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూడిద ట్రిప్పర్‌ల నుంచి వస్తున్న దుమ్ముతో.. ప్రమాదాల బారీన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏదైనా చిన్న జ్వరంకానీ రోగం కానీ వచ్చినా డాక్టర్​కు చూపించుకోలేని పరిస్థితి మాది.. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాకు, ఈరోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి శాపం ఎంటంటే.. లారీల నుంచి బూడిదను తీసుకొచ్చి మా ఇళ్లపై చిమ్నుతున్నారు.. సురేష్ స్ధానికుడు

పరిశ్రమల కోసం భూములిచ్చాం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తున్నాం..!

థర్మల్ విద్యుత్ కేంద్రం కాలుష్యం వల్ల గ్రామాల్లో నివాసం కష్టమవుతోందంటున్నారు. భవిష్యత్‌ తరాలకు రోగాలను వారసత్వంగా ఇస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం బూడిద రవాణాపై ప్రభుత్వం పరిమితి చర్యలు తీసుకుని తమ ఆరోగ్యం కాపాడాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ ఎన్​టీపీఎస్​కు పొలాలు ఇచ్చినది మా పెద్దలు.. ఈ పరిశ్రమ వల్ల ఏదో మాకు ఉపయోగపడుతుందేమోనని ఇచ్చాము కానీ..మాకే ప్రాణహాని కలుగుతుందంటే మేము ఇచ్చేవాళ్లమే కాదు.. ఇవన్నీ పచ్చటి పొలాలండి..మాకు తెలిసినంత వరకు చాలా పైర్లు పండించే వాళ్లము.. ఇలాంటి పరిసరాల్ని కలుషితం చేశారు.. నాశనం చేశారు.. ఈ బూడిద వల్ల మాకు ఎంతో నష్టం జరుగుతోంది.. కళ్లు, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి.. ఆరోగ్యం క్షీణించిపోతోంది.. మస్తఫా స్థానికుడు

ఇవీ చదవండి:

Last Updated :Jan 4, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.