ETV Bharat / state

'హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి'

author img

By

Published : Nov 28, 2020, 3:43 PM IST

Chandrababu , lokesh pays homage to Mahatma Jyotirao Poole
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి

మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులర్పించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీ నిధులను మళ్లించి.. మహాత్మా జ్యోతీరావు పూలే స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.

విదేశీ విద్య, పెళ్లి కానుక తదితర పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. వైకాపా ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను మూసేసి.. పేదల పొట్ట కొట్టిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా దోపిడితో.. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి, ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు వైకాపా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల హక్కులు, పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. జ్యోతిరావు పూలే, మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధన కోసమే.. ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని గుర్తు చేశారు. పార్టీకి బీసీలు ఉండగా ఉంటున్నారని ప్రభుత్వానికి అక్కసు అని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని ఆగ్రహించారు.

ఇదీ చూడండి:

'అమరావతి కోసం రైతుల గుండెలు ఆగినా...సీఎం గుండె మాత్రం కరగడం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.