ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం.. ఏపీజీఈఎఫ్ వెంకట్రామిరెడ్డి

author img

By

Published : Mar 6, 2023, 1:28 PM IST

వెంకట్రామిరెడ్డి

AP Secretariat Employees Association : లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుతంలోకి తీసుకోవడం సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం అని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అనేకమంది సచివాలయ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని కోరినా... సీఎం మాత్రం గౌరవ ప్రదంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారని కొనియాడారు.

AP Secretariat Employees Association : సుమారు లక్షన్నర మంది సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుతంలోకి తీసుకోవడం సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం అని ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అనేకమంది సచివాలయ ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని కోరినా... సీఎం మాత్రం గౌరవ ప్రదంగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నారని కొనియాడారు. విశాఖలో నిర్వహించి ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సచివాలయ ఉద్యోగుల సేవలు మర్చిపోలేనివి.. రాష్ట్ర ప్రభుతంలోకి 1.50 లక్షల మందిని ఉద్యోగులుగా తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయం అని చెప్పారు. కరోనా సమయంలో సచివాలయ ఉద్యోగుల సేవలు మర్చిపోలేనివని గుర్తు చేస్తూ.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు అందిస్తున్నారని చెప్పారు. ఒకటీ రెండు ఇబ్బందులు వస్తే బయటకి వచ్చి కొందరు నిరసనలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో అన్యాయం చేయరని చెప్పారు. కొత్త రిక్రూట్ మెంట్ జరగకుండానే సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరుగుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరు ఏప్రిల్ లో బదిలీలు ఉండచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. కష్ట కాలంలో సీఎంకు ఉద్యోగులు అండగా ఉండాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి కోరారు.

ఫెడరేషన్ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ ను గెలిపించాలి. ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు మేలు చేసే పనులు ఎన్నో జరిగాయి. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు ఎన్నో పరిష్కారం అయ్యాయి. జాయింట్ కౌన్సిల్ సమావేశంలో మేం 95 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం 24 అంశాలపే క్లారిటీ ఇచ్చింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న వారికి పదోన్నతులు కల్పించాం. సర్వే డిపార్ట్ మెంట్ లో పదోన్నతులు కల్పించాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికలు పూర్తయ్యాక ఉద్యోగుల బదిలీలపై చర్చించడానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2007లో రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన వీఆర్ఏల పదోన్నతుల విషయం కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సమగ్రశిక్ష అభియాన్, సీఆర్టీలకు ఎంటిఎస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. హైకోర్టు ఆదేశించినట్లుగా 2008 డీఎస్సీ అభ్యర్థులను రెగ్యులర్ చేయాలని విజ్ఙప్తి చేశాం. కాంట్రాక్టు లెక్చరర్ల మాదిరిగానే కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కూడా 12 నెలల వేతనం ఇవ్వాలని కోరాం. 98డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఉత్తర్వులు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మా ప్రయత్నాలకు మద్దతుగా మరింత బలం చేకూరాలంటే వైఎస్సార్సీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉంది. - వెంకట్రామిరెడ్డి, ఏపీ గవర్నమెంట్ ఉద్యోగుల ఫెడరేషన్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.