ETV Bharat / state

వివేకా హత్య కేసు విచారణ.. తర్వాత వంతు ముఖ్యమంత్రిదే: టీడీపీ

author img

By

Published : Feb 3, 2023, 4:43 PM IST

Updated : Feb 3, 2023, 7:29 PM IST

Etv Bharat
Etv Bharat

Viveka Murder Case : వివేకా హత్య కేసులో అసలు పాత్రధారులపై విచారణ ప్రారంభమైందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. తర్వాత వంతు జగన్​మోహన్​ రెడ్డిదేనని అన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్​ రెడ్డి మాటలు హాస్యాస్పదమని అగ్రహం వ్యక్తం చేశారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసు పాత్రధారులు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్​లు ఇప్పుడు సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలు అన్నారు. తర్వాత వంతు హత్యకు సూత్రధారులైన జగన్​ మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలదేనని ఎమ్మెల్సీ, టీడీపీ నేత బీటెక్ రవి చెప్పారు. గత పరిణామాలను బట్టి.. జగన్​మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని అంతా భావించారన్నారు. తాజా పరిణామాలతో జగన్, భారతి రెడ్డిలే అసలు సూత్రధారులని స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. అందరికీ ఎలాగైతే నోటీసులిచ్చి సీబీఐ విచారణ చేస్తున్నారో.. జగన్, భారతి రెడ్డిలకు కూడా నోటీసులిచ్చి విచారణ జరపించాలని డిమాండ్ చేశారు.

తమ సొంత ఫోన్లలో మాట్లాడితే ఎదురయ్యే ఇబ్బందులు, భవిష్యత్తును గమనించే ఆనాడు కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ఫోన్​ల నుంచి అసలు సూత్రధారులు మాట్లాడారని విమర్శించారు. కోటంరెడ్డి, ఆనంలను చంద్రబాబు ట్రాప్ చేశారని.. అధికారంలో ఉన్న కాకాణి మాట్లాడటం హాస్యాస్పదమని టీడీపీ నేతలు మండిపడ్డారు. ట్యాపింగ్ సంభాషణ ఇంకొకరికి పంపాలంటే రికార్డింగ్ చేస్తేనే సాధ్యమనే అవగాహన కూడా లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీటెక్ రవి, టీడీపీ నేత

"అవినాష్​ రెడ్డి చెప్పాడని ఇప్పుడు నవీన్​ను, తర్వాత కృష్ణమోహన్ రెడ్డి​లను సీబీఐ విచారిస్తోంది. నేను మాట్లాడింది జగన్​తో, నేను మాట్లాడింది భారతితో అని అవినాష్​ రెడ్డి చెప్పాడు. సీబీఐ నిష్పాక్షపాతంగా తర్వాత నోటీసులు భారతికి, జగన్​మోహన్​ రెడ్డికి అందించి.. అవినాష్​ రెడ్డిని విచారించినట్లే విచారించాల్సిన అవసరం ఉంది. ఈ పరిణామాలన్ని చూస్తుంటే.. జగన్​మోహన్​ రెడ్డి ఆయన కుటుంబం దీనిలో మునిగిపోయి ఉన్నట్లు అనిపిస్తోంది." -బీటెక్ రవి, టీడీపీ నేత

ఇవీ చదవండి :

Last Updated :Feb 3, 2023, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.