ETV Bharat / state

మహిళా రైతులపై అవమానకరంగా పోస్టు... యువకుడికి దేహశుద్ధి

author img

By

Published : Oct 15, 2020, 4:52 PM IST

Updated : Oct 15, 2020, 7:45 PM IST

Womens and farmers attack on a young man in Tulluru
Womens and farmers attack on a young man in Tulluru

గుంటూరు జిల్లా తుళ్లూరులో ఓ యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని అతనికి బుద్ధి చెప్పారు.

మహిళా రైతులపై అవమానకరంగా పోస్టు... యువకుడికి దేహశుద్ధి

అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా తుళ్లూరులో యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. ఓ వైపు బతుకు పోరాటం చేస్తుంటే ఇలా అవహేళన చేయడం ఏంటంటూ అతనిపై మండిపడ్డారు.

అమరావతి ఉద్యమం 300వ రోజున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తుళ్లూరులోని ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ దుస్థితిని రైతులు, మహిళలు ఆయనకు వివరించారు. ఇదే అంశాన్ని హేళన చేస్తూ తుళ్లూరుకు చెందిన యువకుడు పోస్టులు పెట్టడంపై రైతులు, మహిళలు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఉన్మాదికి మరణదండన విధించాలి: యువతి బంధువులు

Last Updated :Oct 15, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.