గుంటూరు జిల్లా నరసరావుపేటలో 67వ రాష్ట్ర స్థాయి మహిళ, పురుషుల కబడ్డీ పోటీలను ఉపసభాపతి కోన రఘుపతి ప్రారంభించారు. చిన్న వయస్సు నుంచి ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉల్లాసంగాను ఉండగలుగుతారని ఆయన అన్నారు. ప్రస్తుత జీవన విధానంలో ఉన్న ఒత్తిడిని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరికి క్రీడలు ముఖ్యమని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు.
దీ చదవండి: పోలవరంపై జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్ష