పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి చేపట్టిన చర్యలపై... జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్షించింది. పునరావాసం కల్పించకుండానే పోలవరం నిర్మాణం చేస్తున్నారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. జాతీయ మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం కేంద్ర కార్యదర్శి(భూవనరులు) నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో నీతి ఆయోగ్, ఏపీ, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని ఏపీ అధికారులకు కమిటీ సూచించింది. ఒడిశా, ఛత్తీస్ఘడ్, తెలంగాణల్లోనూ పోలవరం ప్రభావం ఉంటుందని ఆయా రాష్ట్రాలను కూడా సమావేశానికి పిలవాలని పెంటపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'ఆ షరతులకు లోబడి ఉంటేనే... పోలవరానికి నిధులు'