ETV Bharat / state

ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అన్నిపోలీసు స్టేషన్లలో ఫిర్యాదు

author img

By

Published : Aug 4, 2020, 12:56 PM IST

తమని నమ్మించి మోసం చేశారంటూ.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై రైతులు మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా ఉంటుందంటూ మాట ఇచ్చి.. ఇప్పుడు మోసం చేశారని మండిపడ్డారు.

police compliant
police compliant

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై మంగళగిరి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రైతులు ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి విషయంలో నమ్మించి మోసం చేసినందుకు ఎమ్మెల్యే పై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతి ఉంటుందంటూ ఆళ్ల చేసిన ప్రకటనలను రైతులు తమ ఫిర్యాదుకు జత చేశారు. ఇప్పుడు మాటతప్పి తమని మోసం చేసినందున ఎమ్మెల్యే పై కేసు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కరోనా విలయతాండవం- కొత్తగా 52,050 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.