People Rejecting Cent Land: సెంటు భూమి వద్దు..తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

author img

By

Published : May 27, 2023, 3:38 PM IST

Etv Bharat

People Rejecting Cent Land: రాజధాని భూముల్లో పేదలకు సెంటు భూమి ఇవ్వాలని సీఎం జగన్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఉన్నారు. శుక్రవారం రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కానీ జగన్ నిర్ణయాన్ని కొందరు తీవ్రంగా ఖండించారు. వాలంటీర్ల చేత వైఎస్సార్సీపీ నేతలు వారిని కార్యక్రమానికి తరలించాలని బలవంతానికి దిగారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు సెంటు భూమి వద్దంటూ ధర్నాకు దిగారు.

సెంటు భూమి వద్దు..తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

People Rejecting Cent Land : సీఎం జగన్ మోహన్ రెడ్డి.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ పాలెంలో రాజధాని అమరావతి పరిధిలో ఉన్న 50,793 మంది పేదలకు శుక్రవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా రాజధాని ప్రాంతంలోని ఆర్5 జోన్‌లో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కానీ మరోవైపు ఆ ఇళ్ల పట్టాలు వద్దంటూ సీఎం సభకు వెళ్లకుండా, శని వారం ధర్నా నిర్వహించారు.

ప్రాణాలైన ఇస్తాం..సెంటు స్థలం తీసుకోము : గుంటూరు జిల్లా మంగళగిరి గండాలయ్య పేట వాసులు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంటు భూమి స్థలాలను గండాలయపేట వాసులు మూకుమ్మడిగా తిరస్కరించారు. తాము ఎన్నో దశాబ్దాలుగా ఈ మట్టితో కలసి ఉంటున్నామని, ఉన్న ఫళంగా ఖాళీ చేసి వెళ్లిపోమంటే వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రాణాలైనా ఇస్తామని, కానీ సెంటు స్థలాలు తీసుకోబోమని వారు స్పష్టం చేశారు.

Pothina Mahesh On Houses: 'సెంటు భూమి పేరుతో జగన్ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు'

సెంటు భూమి లేఅవుట్లలో ఎలాంటి సౌకర్యాలు లేవని, వర్షాలు వస్తే మోకాల్లోతు బురద ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నామన్నారు. ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు కలిసి ఉంటున్నామని, సెంటు తీసుకుంటే మిగిలిన వారంతా ఎక్కడుండాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గురువారం సాయంత్రం వాలంటీర్లు వచ్చి బస్సులు పెట్టి, శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సభకు రావాలని చెప్పారు. తాము మూకుమ్మడిగా తిరస్కరించి, సీఎం కార్యక్రమానికి వెళ్లలేదన్నారు. కానీ వైఎస్సార్సీపీ నేతలు వారిని బలవంతంగా సీఎం కార్యక్రమానికి తరలించాలని చూశారనీ, వారి ప్రయత్నాలు ఫలించలేదన్నారు.

ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు.. వారంలో ఇళ్ల నిర్మాణాలు: సీఎం జగన్‌

తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా : గండాలయ్య పేట వాసులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. వీరికి సీపీఎం, తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు తెలిపారు. లబ్ధిదారులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. పేదల ఇళ్లని తొలగించవద్దని, రాజధానిలో పట్టాలు వద్దని, నివసించే చోటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

టీడీపీ నేతల హామీ : కొండ ప్రాంతాన్ని నమ్ముకొని నివాసం ఉంటున్నామని ఇప్పుడు వాటిని తొలగించి రాజధానిలో మాకు స్థలాలు ఇస్తామంటే వాటిని తీసుకునేందుకు సిద్ధంగా లేమనీ లబ్దిదారులు చెప్పారు. ప్రభుత్వం బలవంతంగా తరలిస్తే ఎలాంటి ఆందోళనకైనా సిద్ధమని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న నివసించే చోటనే ఇంటికే పట్టాలు అందజేస్తామని టీడీపీ నేతలు గండాలయ్య పేట వాసులకు హామీ ఇచ్చారు.

"మేము మా తాతల కాలం నుంచి కొండ ప్రాంతంలోనే ఉంటున్నాము. మాకు అక్కడే పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అక్కడ ఎక్కడో సెంటు భూమి స్థలం ఇస్తామంటున్నారు. అక్కడ అప్పులు చేసి ఇళ్లు కట్టుకునే స్థోమత లేదు. అక్కడ నుంచి వచ్చి కూలి పనులు చేసుకోవడం కష్టం అవుతుంది."- గండాలయ్య పేట వాసురాలు

"రాజధానిలో సెంటు భూమి ఇస్తామంటున్నారు, మాకైతే అక్కడ వద్దు. మాకు కొండపైన ఇళ్ల పట్టాలు తీసుకుంటాం. మేము దేనికైనా సిద్ద పడతాం. మాకు కరెంట్ లేకపోయిన పర్వాలేదు. మేము కొండపైనే ఉంటాం."- గండాలయ్య పేట వాసురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.