ETV Bharat / state

యాచకులకు ఆహారం అందించిన ఎంపీ నందిగం సురేష్

author img

By

Published : Apr 18, 2020, 2:05 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యాచకులకు ఆహారాన్ని అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ, కరోనా వ్యాప్తి నివారణలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

mp nadigam suresh food distributed to beggers
యాచకులకు ఆహారం అందించిన ఎంపీ నందిగం సురేష్

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద ఉన్న 400 మంది యాచకులకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సీతానగరంలో ఉన్న యాచకులకు భోజనం, ఎయిడ్స్ రోగులకు మందులు అందజేశారు. కరోనా నుంచి తప్పించుకోవాలంటే భౌతిక దూరం, స్వీయ నిర్బంధం ఒక్కటే మార్గమని ఎంపీ సురేష్ వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ స్ఫూర్తితో బాపట్లలోనూ పేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆకలితో అలమటిస్తున్న వారికి.. అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.