ETV Bharat / state

ACCIDENT : ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

author img

By

Published : Aug 24, 2021, 2:01 AM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి

గుంటూరు జిల్లాలోని ఎర్రగొండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి డ్రెయిన్​లో పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భరత్ కొంత కాలంగా తెనాలిలో పానీపూరి వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిలకలూరిపేటలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లి, ద్విచక్రవాహనంపై తెనాలికి వస్తుండగా... ఎర్రగొండ సమీపంలో అదుపుతప్పి డ్రెయిన్​లో పడ్డాడు, ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు... భరత్ మృతదేహాన్ని బయటకు తీసి, శవపరీక్ష నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

చాక్లెట్​ కొనిస్తానని తీసుకెళ్లి.. ఆరేళ్ల బాలుడిపై...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.