ETV Bharat / state

'నా హోటల్​ను వైకాపా నేత ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు'

author img

By

Published : Nov 30, 2020, 8:01 PM IST

'నా హోటల్​ను వైకాపా నేత ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు'
'నా హోటల్​ను వైకాపా నేత ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు'

ఓ వైకాపా నేత తమ హోటల్​ను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ...గుంటూరు జిల్లా సాతులూరుకు చెందిన కొత్తపల్లి మాలతి అనే మహిళ గ్రామీణ ఎస్పీ గ్రీవెన్స్ సెల్​ను ఆశ్రయించింది. స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని..,తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

తమ హోటల్​ను ఓ వైకాపా నాయకుడు ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ... గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన మహిళా గ్రామీణ ఎస్పీని ఆశ్రయించింది. గత 40 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న హోటల్​ను వైకాపా నేత చేరెడ్డి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకోవాలని చూస్తున్నాడని గ్రామానికి చెందిన కొత్తపల్లి మాలతి ఆరోపించారు. న్యాయం చేయాలంటూ గ్రామీణ ఎస్పీ గ్రీవెన్స్ సెల్​ను ఆశ్రయించారు.

'నా హోటల్​ను వైకాపా నేత ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు'

ఇటీవల హోటల్​ పునఃనిర్మించడానికి ప్రయత్నించగా... కృష్ణారెడ్డి అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. రెవెన్యూ, పోలీసు సిబ్బందిని పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని..., స్థానిక ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయింది. పెద్ద మనుషులు పంచాయితీకి పిలిస్తే..."నా గురించి ఆ అమ్మాయి ఏదైనా ఆలోచిస్తే...న్యాయం చేస్తాను" అంటూ కృష్ణా రెడ్డి ద్వంద అర్థాలతో మాట్లాడుతున్నాడని ఆరోపించింది. తమకు హోటలే ఆధారమని...,పోలీసులు స్పందించి న్యాయం చేయాలని వేడుకొంటుంది.

ఇదీచదవండి

ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.