ETV Bharat / state

కోర్టు ధిక్కరణ కేసులో.. హైకోర్టుకు డీజీపీ

author img

By

Published : Feb 28, 2023, 9:25 AM IST

Contempt of Court Case
కోర్టు ధిక్కరణ కేసు

Contempt of Court Case: కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మాజీ డీజీపీ, ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ సైతం కోర్టుకు రావాల్సి ఉండగా.. తదుపరి విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను మార్చి 20కి వాయిదా వేసింది.

DGP attended the High Court in the contempt of court: కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే ఎంతటి వారైనా కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవలసి వస్తుందని మరోసారి రుజువు అయింది. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టు విచారణకు వచ్చారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో.. ఆయన కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొన్నారు.

విజయనగరం జిల్లాలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి సంబంధించిన పదోన్నతి విషయంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలు ఇచ్చింది. కానీ వీటిని అమలు చేయకపోవడంతో.. సదరు ఇన్‌స్పెక్టర్‌ మరోసారి కోర్టు ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు.. ప్రస్తుత డీజీపీతో పాటు, మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ ఛైర్మన్ కూడా కోర్టుకు రావాలని పేర్కొంది. దీంతో ప్రస్తుత డీజీపీ కోర్టు ధిక్కరణ కేసులో.. కోర్టుకు హాజరయ్యారు.

అసలు ఏం జరిగిందంటే: కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. మాజీ డీజీపీ, ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌ సైతం కోర్టుకు రావాల్సి ఉండగా కేరళలో సమావేశానికి హాజరు అయినందున రాలేకపోతున్నాను అని.. అందుకు మన్నించాలని, తదుపరి విచారణకు హాజరు అవుతానని అఫిడవిట్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం అందుకు సానుకూలంగా స్పందించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. గంగారావు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 1999లో జారీచేసిన జీవో 257 ప్రకారం విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ రాజశేఖర్‌కు పదోన్నతి కల్పించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబర్‌ 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంలో రాజశేఖర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పూర్వ డీజీపీ, ప్రస్తుత డీజీపీల హాజరుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి విచారణకు హాజరు అయ్యారు.

రాజశేఖర్‌ ఏసీఆర్‌ (వార్షిక రహస్య నివేదిక) సంతృప్తికరంగా లేదని డీజీపి తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఆయన పదోన్నతి ప్రతిపాదనను డిపార్ట్‌మెంటల్‌ పదోన్నతి కమిటీ తిరస్కరించిందని అన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు వేసేందుకు సమయం కావాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. పదోన్నతి కల్పించే విషయంలో అన్ని అంశాలన్ని మరోసారి పరిశీలన చేయాలని సూచించారు. కౌంటర్‌ దాఖలు వేసేందుకు సమయం ఇస్తూ.. విచారణను మార్చి 20వ తేదీకి వాయిదా వేశారు. తదుపరి విచారణకు హాజరు నుంచి డీజీపీకి మినహాయింపు ఇచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.