రాష్ట్రంలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇందులో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానంతోపాటు... కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల స్థానం ఉన్నాయి. అలాగే ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం ఉన్నాయి. ఇక అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి సంబంధించి ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా... మార్చి 13న పోలింగ్ నిర్వహించి, 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇవీ చదవండి: