ETV Bharat / state

'రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో రైతులకు మేలు'

author img

By

Published : Oct 9, 2020, 5:15 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలకులు డాక్టర్ అజయ్ సింగ్ పర్యటించారు. రైతులతో సమావేశమై...రాష్ట్రీయ కృషి వికాస్​ యోజన పథకం గురించి వివరించారు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో రైతులకు మేలు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనతో రైతులకు మేలు

రాష్ట్రీయ కృషి వికాస్​ యోజనతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిశీలకులు డాక్టర్ అజయ్ సింగ్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో రైతులతో సమావేశమైన ఆయన...పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ రంగ విధానాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు..,వాటి నిర్వహణ తదితర అంశాలను ఆయన నమోదు చేసుకున్నారు. అజాయ్ సింగ్​తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

24 గంటల్లో అల్పపీడనం.. 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.