ETV Bharat / state

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో తహశీల్దార్ల బదిలీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 2:16 PM IST

aros_appointed_in_andhra_pradesh
aros_appointed_in_andhra_pradesh

AROs Appointed in Andhra Pradesh: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పలువురు తహశీల్దార్లను బదిలీ చేసింది. ఈ మేరకు సీసీఎల్​ఏ ఉత్తర్వులు జారీ చేసింది.

AROs Appointed in Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ రోజురోజుకు పుంజుకుంటోంది. రానున్న ఎన్నికలకు అధికారులు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలకు అధికారుల నియామక ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నాలుగో జోన్​లో ఏఆర్వోలను నియమిస్తూ భూ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సిఫార్సుల మేరకు రాయలసీమ ప్రాంతంలోని నాలుగో జోన్​లో తహశీల్దార్లుగా, ఎన్నికల ఏఆర్వోలుగా నియమిస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కలెక్టరేట్లలో పనిచేస్తున్న అధికారులను తహసిల్దార్లుగా బదిలీ చేయటంతో పాటు వారిని 21 నియోజకవర్గాలకు ఏఆర్వోలుగా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

MLA Rapaka ఎమ్మెల్యే రాపాక: నేను ఎన్నికల్లో గెలవడానికి దొంగ ఓట్లే కారణం.. రంగంలోకి దిగిన ఈసీ

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జోన్లలోనూ వివిధ నియోజకవర్గాలకు ఏఅర్వోలను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఈమేరకు ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ సీసీఎల్ఏ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలన్నీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకుని చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

Jamili Elections జమిలి ఎన్నికలు - దేశంపై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

జోన్‌-4లో పలువురు తహశీల్దార్ల బదిలీ వివరాలు : నాలుగో జోన్​లో 21 మందిని బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కర్నూలు జిల్లాలోని పత్తికొండ, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, చిప్పగిరికి నూతన తహశీల్దార్‌లు నియమితులయ్యారు. అనంతపురం జిల్లాలో ఉరవకొండ, కల్యాణదుర్గం, యాడికి, రాప్తాడు, రామగిరికి తహశీల్దార్లును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సత్యసాయి జిల్లాలో మడకశిర, గుడిబండ, పుట్టపర్తి, నల్లమడ, ధర్మవరంతో పాటు వైఎస్సార్‌ జిల్లా చాపాడుకు ఒకరు బదిలీ అయ్యారు. అన్నమయ్య జిల్లాలో సుండుపల్లి, పుల్లంపేట, రామాపురం, కలకాడ, వాయల్పాడుకు కొత్త తహశీల్దార్లను నియమితులయ్యారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లకు తహశీల్దార్లు రిపోర్టు చేయాలని సీసీఎల్‌ఏ కార్యాలయం ఆదేశించింది.

"శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరగాలి - వారు ఎన్నికల పక్రియకు హాని"

బదిలీ అయిన తహశీల్దార్ల వీరే

జిల్లా మండలంఅధికారి పేరు
కర్నూలు జిల్లాపత్తికొండపద్మజ
కోసిగిపి. మురళి
కౌతాళంఅలెగ్జాండర్‌
పెద్దకడబూరువి.సురేశ్‌బాబు
చిప్పగిరి రామాంజులు నాయక్‌
అనంతపురం జిల్లా ఉరవకొండ పద్మావతమ్మ
కల్యాణదుర్గంసుభాకర్‌రావు
రాప్తాడురామాంజనమ్మ
రామగిరివి. శ్రీనివాసులు
యాడికి టి.జి. మోహన్‌వల్లీ
సత్యసాయి జిల్లామడకశిరఎ.వెంకటేశ్వర్లు
గుడిబండఈ.ప్రతాప్‌రెడ్డి
ధర్మవరండి.శ్రావణి
పుట్టపర్తిభారతి
నల్లమడజి.నాగభూషణం
అన్నమయ్య జిల్లాసుండుపల్లిజి.పుణ్యవతి
పుల్లంపేటశ్రీనివాసులు
రామాపురంఆనంద్‌కుమార్‌
కలకాడఆర్‌.బాలాజీరాజు
వాయల్పాడుకతీన్‌ జన్‌కుఫ్రా
వైఎస్సార్‌ జిల్లాచాపాడుభూషణం

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఏం చేయాలి ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.