ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Dec 17, 2022, 12:58 PM IST

ఏపీ ప్రధాన వార్తలు
TOP NEWS

..

  • మాచర్ల మారణహోమం.. టీడీపీ నేతల "చలో నరసరావుపేట".. నాయకుల గృహనిర్బంధం
    పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ శ్రేణుల విధ్వంసకాండని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన "చలో నరసరావుపేట" కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. టీడీపీ నేతలు నరసరావుపేట వెళ్లకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మాచర్ల హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదు: ఎస్పీ రవిశంకర్ రెడ్డి
    మాచర్ల హింసలో ఎలాంటి రాజకీయ కోణం లేదని కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య నెలకొన్న ఫ్యాక్షన్‌ తగాదాల నేపథ్యంలోనే ఘటన జరిగిందని పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి చెప్పారు. దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటున్నాము. ప్రస్తుతానికి మాచర్లలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు.. రోడ్డెక్కిన గిరిజనలు.. నిలిచిపోయిన రాకపోకలు
    ఎర్రవరం పరిధిలోని హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటాన్నిగిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణం ర‌ద్దు చేయాలని రోడ్డెక్కారు. పంటలు, ఫలాలు పండిస్తూ జీవిసిస్తున్నామని.. పవర్ ప్రాజెక్టు వస్తే జీవనాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేసున్నారు. తమకు న్యాయం చేసేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కాకినాడలో 338 ఎకరాల భూమిని తాకట్టు పెట్టిన సర్కార్..
    రాష్ట్ర అప్పుల విశ్వరూపంలో ఇది మరో అంకం. పిట్టను కొట్టి.. పొయ్యిలో పెట్టడమన్న చందంగా రాష్ట్ర ఆర్థిక దుస్థితి దిగజారిపోయిన పరిస్థితుల్లో రకరకాల కారణాలు చెప్పి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించాల్సి వస్తోంది. కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే రుణాలు తెచ్చుకుని వినియోగించుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా అదే తీరులో ఏపీ మారిటైం బోర్డు రుణాలను తీగ లాగితే ఎంతో విలువైన కాకినాడ పోర్టు భూములు తాకట్టు పెట్టేసిన డొంక కదిలింది. పోర్టుల అభివృద్ధికే రుణమంటూ.. ఏకంగా 1,500 కోట్ల రుణం ఏపీ మారిటైం బోర్డు సాయంతో తెచ్చింది. కాకినాడలోని ఎంతో విలువైన 338 ఎకరాల ప్రభుత్వ భూములను ఎస్‌బీఐ క్యాప్‌కు తాకట్టు పెట్టేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నేవీ అల్లుడికి కట్నంగా బుల్డోజర్​.. అందుకోసమేనట!
    ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తన అల్లుడికి కట్నంగా బుల్డోజర్ ఇచ్చారు. తన కుమార్తె సివిల్స్​కు ప్రిపేర్ అవుతోందని.. అందులో విఫలమైనా జీవనోపాధి కోసం బుల్డోజర్ పనికొస్తుందనే ఇలా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.5 కుర్​కురే ప్యాకెట్​లో రూ.500 నోట్లు.. దుకాణాల వద్ద గ్రామస్థుల క్యూ..
    ఐదు రూపాయల కుర్​కురే ప్యాకెట్‌లో 500 రూపాయల నోటు దొరికింది. దీంతో ఆశ్చర్యపోయిన గ్రామస్థులు కుర్కురే కొనుగోలు చేసేందుకు దుకాణం చుట్టూ బారులు తీరారు. ఈ వింత సంఘటన కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనాలో పెరుగుతున్న కరోనా​.. ఏప్రిల్​ 1 నాటికి గరిష్ఠ స్థాయిలో కేసులు..!
    వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి చైనాలో కరోనా కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్' ఒక అంచనా విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఏపీ,తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.